మూడో దశ.. ములాయం కుటుంబం నుంచి ముగ్గురు.. గెలుపు వరించేనా..?
యూపీలో మూడో దశ పోలింగ్లో భాగంగా 10 నియోజకవర్గాలకు మే7న పోలింగ్ జరగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: లోక్సభ ఎన్నికల్లో 80 సీట్లు ఉన్న పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ వైపే అందరి దృష్టి. ఇక్కడ ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీయే దిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటుంది. ఇప్పటికే రెండు దశల్లో 16 స్థానాలకు పోలింగ్ ముగియగా.. తాజాగా మూడో దశలో మరో 10 సీట్లకు మే 7న పోలింగ్ జరగనుంది. ఈ దశలో ములాయం సింగ్యాదవ్ కుటుంబం నుంచి ముగ్గురు బరిలో ఉండటంతో ఆయా స్థానాలపై ఆసక్తి నెలకొంది.
మూడో దశలో భాగంగా యూపీలో సంభల్, హత్రాస్, ఆగ్రా, ఫతేపుర్ సిక్రీ, ఫిరోజాబాద్, మైన్పురీ, ఇటా, బదౌన్, ఓన్ల, బరేలీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశ ఎన్నికలు ములాయం కుటుంబానికి ఎంతో కీలకం. ముగ్గురు కీలక నేతలు బరిలో ఉన్నారు.
మైన్పురీ-డింపుల్ యాదవ్
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మైన్పురీలో 1996లో గెలిచినప్పటినుంచి ఈ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా మారింది. 2019 ఎన్నికల్లో ములాయం భాజపా అభ్యర్థిపై 94 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన మరణానంతరం వచ్చిన ఉప ఎన్నికలో ఆయన కోడలు డింపుల్ యాదవ్ పోటీ చేసి ఘన విజయం సాధించారు. మరోసారి ఇదే స్థానం నుంచి బరిలో నిలిచారు. భాజపా అభ్యర్థి, యూపీ టూరిజం మంత్రి జైవీర్ సింగ్ ఆమెపై పోటీకి దిగారు. ఈ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది.
ఫిరోజాబాద్-అక్షయ్ యాదవ్..
ఎస్పీ ప్రధాన కార్యదర్శి రామ్గోపాల్ యాదవ్ కుమారుడు అక్షయ్ యాదవ్.. ఫిరోజాబాద్ నియోజకవర్గం నుంచి పోటీపడుతున్నారు. 2014లో ఈ నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన అక్షయ్ గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మాత్రం భాజపా అభ్యర్థిపై ఓటమి పాలయ్యారు. మరి ఈ సీటును ఆయన భాజపా నుంచి తిరిగి దక్కించుకుంటారా.. చూడాలి. ఇక్కడ భాజపా తరఫున విశ్వదీప్ సింగ్, మాయావతి బీఎస్పీ తరఫున చౌదరీ బషీర్ బరిలో ఉన్నారు. వీరి మధ్య త్రిముఖ పోరు నెలకొంది.
బదౌన్-ఆదిత్య యాదవ్
ఎస్పీ సీనియర్ నేత శివపాల్సింగ్ యాదవ్ కుమారుడు ఆదిత్య యాదవ్ బదౌన్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలిసారి ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. 1996 నుంచి ఈ నియోజకవర్గంలో ఎస్పీకి గట్టి పట్టు ఉంది. ఎంపీ సలీం ఇక్బాల్ ఇక్కడినుంచి నాలుగుసార్లు సమాజ్వాదీ పార్టీ టికెట్పై గెలుపొందగా.. ఒకసారి కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. 2019లో భాజపా నేత సంగమిత్ర మౌర్య ఇక్కడినుంచి గెలుపొందారు. ఈసారి ఆ పార్టీ దుర్విజయ్ సింగ్ శక్యాను పోటీలోకి దింపింది. ఈ లోక్సభ పరిధిలోని బిల్సీ అసెంబ్లీ నియోజకవర్గంలో శక్యా కమ్యూనిటీ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక్కడ భాజపా, ఎస్పీల మధ్య ద్విముఖ పోరు నెలకొనగా.. బీఎస్పీ తరఫున పోటీ చేస్తున్న ముస్లిం ఖాన్ ఏమేరకు ప్రభావం చూపిస్తారో చూడాలి.
ఇక ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ కనౌజ్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. నాలుగో దశలో భాగంగా ఇక్కడ మే 13న పోలింగ్ జరగనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ
-
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
-
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!
-
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!