యూపీలో ఆఖరి దశ ఆసక్తికరం.. భాజపా, మిత్రపక్షాలకు కీలకం..
యూపీలో మూడు దశల్లో 26 నియోజకవర్టాల్లో పోలింగ్ ముగిసింది. మరో 54 స్థానాలకు నాలుగు దశల్లో పోలింగ్ జరగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: లోక్సభ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. దేశ రాజకీయాల్లో అత్యంత కీలకంగా నిలిచే ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే మూడు దశల్లో 26 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. తదుపరి దశ పోలింగ్కు ఆ రాష్ట్రం సిద్ధమవుతోంది. ఇక ఇక్కడ ఏడో దశ పోలింగ్ అత్యంత కీలకం కానుంది. ఎందుకంటే చివరి దశలో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి ఉంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోరఖ్పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానం.. గోరఖ్పూర్ లోక్సభ పరిధిలోకి వస్తుంది. దీంతో ఈ లోక్సభ సీట్లో భాజపా అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించడంపై యోగి దృష్టి పెట్టారు.
యూపీలో మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరుగుతుండగా.. ఆఖరి దశలో 13 స్థానాలు ఉన్నాయి. జూన్ 1న పోలింగ్ జరగనుండగా.. ఈ నెల 7న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దశ భాజపా, ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన అప్నాదళ్(ఎస్)కు కీలకం. గత ఎన్నికల్లో ఇక్కడి 13 స్థానాల్లో 11 ఎన్డీఏ కూటమే గెలుచుకుంది. వీటిలో అప్నాదళ్(ఎస్) గెలుచుకున్న మిర్జాపూర్, రాబర్ట్స్గంజ్ ఉన్నాయి. అయితే.. ఈ నియోజకవర్గాలకు ఇప్పటి వరకూ ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు.
హ్యాట్రిక్ సాధిస్తారా..?
మిర్జాపూర్ నుంచి అప్నాదళ్ అధినేత అనుప్రియ పటేల్ 2014 నుంచి వరుసగా రెండుసార్లు గెలుపొందారు. మూడోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. ఎస్పీ నుంచి రాజేంద్ర ఎస్ బింద్, బీఎస్పీ నుంచి మనీశ్ త్రిపాఠి పోటీలో ఉన్నారు. అయితే.. ఈ నియోజకవర్గం చరిత్ర చూస్తే వరుసగా మూడుసార్లు ఎవరూ గెలుపొందలేదు. దీంతో ఈ స్థానం పటేల్కు సవాల్గా మారింది. ఇక్కడ హ్యాట్రిక్ విజయం సాధించి తన పట్టును నిలుపుకోవాలని ఆమె ఆశిస్తున్నారు. మరోవైపు రాబర్ట్స్ గంజ్లో ఎస్సీ, ఎస్టీ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ఓబీసీలకు ఎంతో కీలకం..
మరోవైపు ఈ దశ ఎన్నికలు ఓబీసీ నేతలకు ఎంతో కీలకం కానున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలైన అనుప్రియ పటేల్, ఓం ప్రకాశ్ రాజ్భర్, సంజయ్ నిషాద్, దారాసింగ్ చౌహాన్లతోపాటు విపక్షాల నేతలైన స్వామి ప్రసాద్ మౌర్య తదితరులకు ఈ ఎన్నికలు పరీక్షగా నిలవనున్నాయి. భాజపా గత ఎన్నికల్లో కోల్పోయిన రెండు సీట్లను తిరిగి పొందేందుకు యత్నిస్తుండగా.. ఎస్పీ, కాంగ్రెస్ ఖాతా తెరిచేందుకు కష్టపడుతున్నాయి.
మరోసారి అఖండ విజయమే..
భాజపాకు కంచుకోటగా మారిన వారణాసి స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ మెజారిటీపై కన్నేశారు. ఇక్కడి నుంచి మూడోసారి పోటీ చేస్తున్న మోదీ.. 2019 ఎన్నికల్లో 63 శాతం ఓట్లతో అఖండ విజయం సాధించారు. మరోసారి భారీ విజయం దక్కడం ఖాయం. మోదీపై ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ బరిలో ఉన్నారు. ఈ స్థానంలో 1996 నుంచి భాజపా ఆరుసార్లు విజయం సాధించింది. 2004లో మాత్రం కాంగ్రెస్ గెలుపొందింది.
భాజపా కంచుకోట గోరఖ్పూర్..
ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ గతంలో పోటీ చేసిన గోరఖ్పూర్ నియోజకవర్గంలో భాజపాకు మంచి పట్టు ఉంది. 1998 నుంచి ఇక్కడ యోగీ వరుసగా గెలుపొందుకుంటూ వచ్చారు. 2017లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో మాత్రం సమాజ్వాదీ పార్టీ విజయం సాధించింది. గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని భాజపా తిరిగి దక్కించుకుంది. యోగీ నేతృత్వంలో భారీ మెజార్టీతో మరోసారి ఈ స్థానాన్ని దక్కించుకోవడంపై భాజపా దృష్టి సారించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
-
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్
-
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
-
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ