Olympics: ప్రాచీన.. ఆధునిక ఒలింపిక్స్కు ఉన్న తేడాలివే!
ఒలింపిక్స్.. ప్రపంచ క్రీడారంగంలో అత్యంత సూదీర్ఘ చరిత్రగల మెగాటోర్నీ. ఇక్కడ పతకం గెలిస్తే దేశపు ప్రతిష్ట మరింత పెరుగుతుందన్న భావన. అందుకే దాదాపు అన్ని దేశాలు ఈ ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొంటాయి. కానీ, ప్రాచీన ఒలింపిక్స్ అలా కాదు. అప్పుడు ఈ ఒలింపిక్స్ ఒక స్థానిక క్రీడలన్న సంగతి తెలుసా? ఇదే కాదు, ప్రస్తుత
ఇంటర్నెట్ డెస్క్: ఒలింపిక్స్.. ప్రపంచ క్రీడారంగంలో అత్యంత సుదీర్ఘ చరిత్రగల మెగా టోర్నీ. ఇక్కడ పతకం గెలిస్తే దేశపు ప్రతిష్ట మరింత పెరుగుతుంది. అందుకే దాదాపు అన్ని దేశాలూ ఈ ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొంటాయి. కానీ, ప్రాచీన ఒలింపిక్స్ అలా కాదు. అప్పుడు ఈ ఒలింపిక్స్ ఒక స్థానిక క్రీడలన్న సంగతి తెలుసా? ఇదే కాదు, ప్రస్తుత ఒలింపిక్స్కు.. ఒకప్పటి గ్రీక్ ఒలింపిక్స్కు చాలా తేడాలున్నాయ్ అవేంటో చూద్దాం..!
* ప్రాచీన ఒలింపిక్స్లో ఒకప్పటి గ్రీక్ రాజ్యంలోని దేశాలు మాత్రమే భాగస్వామ్యయ్యేవి. ఇప్పుడు 200కుపైగా దేశాలు పాల్గొంటున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్లో 205 దేశాల నుంచి 11వేలకుపైగా అథ్లెట్లు వివిధ విభాగాల్లో పోటీపడుతున్నారు.
* అప్పటి ఒలింపిక్స్లో గ్రీక్రాజ్యంలోని పౌరులు మాత్రమే నగ్నంగా క్రీడల్లో పాల్గొనేవారు. మహిళలు పోటీలో పాల్గొనేందుకు అనర్హులు. కాకపోతే వారికి వేరుగా కొన్ని క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించేవారు. ఒలింపిక్స్లో పాల్గొనేలా గ్రీక్ రాజ్యంలో ప్రతి పౌరుడి విద్యాభ్యాసంలో అథ్లెటిక్ శిక్షణ ఉండేది. ఆధునిక ఒలింపిక్స్లో అన్ని దేశాలు పాల్గొనవచ్చు. పురుషులు, మహిళల కోసం వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తున్నారు. కొన్ని క్రీడలు మిక్స్డ్ డబుల్ పేరుతో పురుషులు, మహిళలు కలిసి ఆడుతున్నారు. క్రీడల్లో పాల్గొనేందుకు అథ్లెట్లు వ్యక్తిగతంగా లేదా ప్రభుత్వ స్పోర్ట్స్ అకాడమీలో చేరి శిక్షణ పొందుతుంటారు.
* గ్రీక్ ఒలింపిక్స్ను మతపరమైన క్రీడోత్సవంగా నిర్వహించేవారు. గ్రీక్ దేవుడు జూస్ కోసం ఆడేవారు. కానీ, 1896లో ప్రారంభమైన ఆధునిక ఒలింపిక్స్ను ఒక అంతర్జాతీయ టోర్నీగా మార్చారు. ప్రపంచంలో ఏ మూలన ఉన్న అథ్లెట్ అయినా ఈ పోటీల్లో పాల్గొని సత్తా చాటే అవకాశం కల్పించారు. ఇందులో గెలిస్తే వ్యక్తిగతంగా పేరు రావడమే కాదు.. దేశం కూడా గర్విస్తుంది.
* ప్రాచీన ఒలింపిక్స్ ప్రారంభోత్సవాల్లో వంద ఎద్దుల్ని బలి ఇచ్చేవారట. జ్యోతిని వెలిగించి.. పోటీలు పూర్తయ్యేవరకూ ఆరిపోకుండా చూసేవారు. ఇప్పటి ఒలింపిక్స్లో బలిదానాలు ఏమీ ఉండవు. కానీ.. కనులపండుగా ప్రారంభోత్సవ వేడుక జరుగుతుంది. క్రీడాభిమానుల సమక్షంలో సంగీత కచేరీలు.. కళకారుల ప్రదర్శనలు.. ఆటపాటలు.. బాణాసంచా వెలుగులు ఇలా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సారి టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో మాత్రం కరోనా నిబంధనల దృష్ట్యా క్రీడాభిమానులకు అనుమతి ఇవ్వలేదు. కొద్ది మంది అతిథులు మాత్రమే వేడుకకు హాజరయ్యారు.
* గ్రీక్ ఒలింపిక్స్ ఎప్పుడూ ఒలింపియా వేదికగానే జరిగేవి. మరో వేదిక ఉండేది కాదు. నాలుగేళ్లకోసారి జరిగే ఈ ఆధునిక ఒలింపిక్స్కు ఒక్కోసారి ఒక్కో దేశం ఆతిథ్యమిస్తుంటుంది. తొలి ఒలింపిక్స్ను గ్రీస్లోని ఏథేన్స్లో నిర్వహించారు. ఆ తర్వాత ఫ్రాన్స్, అమెరికా, యూకే ఇలా అనేక దేశాల్లో ఈ మెగాటోర్నీ జరుగుతూ వస్తోంది. తాజాగా జపాన్లోని టోక్యోలో క్రీడలను నిర్వహిస్తున్నారు.
* ప్రాచీన ఒలింపిక్స్ క్రీడల్లో కేవలం ఒక్క విజేత మాత్రమే ఉండేవారు. పోటీలో గెలుపొంది అగ్రస్థానానికి వచ్చిన అథ్లెట్ను విజేతగా ప్రకటించి.. అతడికి ఆలివ్ ఆకులతో చేసిన కిరీటాన్ని ధరింపజేసేవారు. ఆ కాలంలో ఆలివ్ ఆకులను చాలా విశిష్ఠమైనవిగా భావించేవారు. అందుకే వాటితో సత్కరించేవారు. అలాగే, భూమిని కూడా రాసిచ్చేవారట. ఆ తర్వాత విజేత విగ్రహాన్ని ఒలింపియా స్టేడియంలో ఏర్పాటు చేసేవారు.
* గ్రీక్ ఒలింపిక్స్ నిర్వాహకులు ఎప్పుడూ వింటర్ ఒలింపిక్స్ నిర్వహించలేదు. వారికి ఆ ఆలోచన కూడా రాలేదు. కానీ, ఆధునిక ఒలింపిక్స్లో వింటర్ ఒలింపిక్స్ను ప్రారంభించారు. మంచులో.. మంచుతో ఆడే ఈ క్రీడలను తొలిసారి ఫ్రాన్స్లో 1924లో ప్రారంభించారు. ఈ పోటీల్లో 17 దేశాల నుంచి 258 అథ్లెట్లు పాల్గొన్నారు. వింటర్తోపాటు పారా ఒలింపిక్స్, యూత్ ఒలింపిక్స్ క్రీడలను సైతం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్వహిస్తోంది. తొలి యూత్ ఒలింపిక్స్ 2010 ఆగస్టులో సింగపూర్ వేదికగా జరిగింది.
* ప్రాచీన ఒలింపిక్స్లో గుర్రపు బండ్ల పరుగు, రన్నింగ్, రెజ్లింగ్, డిస్కస్ త్రో, షాట్పుట్, ఆర్చరీ, లాంగ్ జంప్, వెయిట్ లిఫ్టింగ్, జెవలీన్, జిమ్నాస్టిక్స్ వంటి క్రీడలు ఉండేవి. ఆధునిక ఒలింపిక్స్లో గుర్రపు బండ్ల పరుగు మినహా మిగతా వీటితోపాటు బైసైక్లింగ్, మారథాన్స్, స్విమ్మింగ్, డైవింగ్, సెయిలింగ్, షూటింగ్, టెన్నీస్ ఇలా అనేక అనేక క్రీడలను ప్రవేశపెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?