అమెరికా స్వాతంత్ర్యం.. ఆసక్తికర విషయాలు
అగ్రరాజ్యం అమెరికా స్వాతంత్ర దినోత్సవం నేడు. బ్రిటీష్ పాలనలో ఎన్నో ఏళ్లు అణిచివేతకు లోనై తిరగబడటంతో ఎట్టకేలకు అమెరికా 1776 జులై 4న స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. అప్పటి నుంచి ఏటా స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుతోంది. అమెరికాలోని అన్ని రాష్ట్రాలు
అగ్రరాజ్యం అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం నేడు. బ్రిటీష్ పాలనలో ఎన్నో ఏళ్లు అణిచివేతకు గురై తిరగబడటంతో ఎట్టకేలకు అమెరికా 1776 జులై 4న స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. అప్పటి నుంచి ఏటా స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుతోంది. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో బాణ సంచాలు పేలుస్తూ.. వేల మంది గుంపులుగా చేరి ఈ రోజును వేడుకగా జరుపుకొనేవారు.. కానీ కరోనా కారణంగా ఈ ఏడాది అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సాదాసీదాగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం...
* వాస్తవానికి అమెరికాకు 1776 జులై 2నే స్వతంత్రం వచ్చింది. కానీ అందుకు కారణాలను వివరిస్తూ కాంటినెంటల్ కాంగ్రెస్.. బ్రిటన్ కింగ్ జార్జ్కు లేఖ రాసింది. ఆయన ఆమోదంతో జులై 4న అధికారికంగా స్వాతంత్ర్య ప్రకటన చేశారు. కానీ అమెరికా రాష్ట్రాల సంతకాలు, ఇతర ప్రక్రియలు ఆగస్టు 2 వరకు సాగాయి.
* శ్వేతసౌధంలో ఈ వేడుకలు తొలిసారిగా 1801లో జరిగాయి. అప్పటి దేశాధ్యక్షుడు థామస్ జఫర్సన్ ఈ వేడుకలను నిర్వహించారు.
* థామస్ జఫర్సన్ అమెరికా స్వాతంత్ర్య ప్రకటిస్తున్నట్లు తెలిపే ప్రకటనను రూపొందించారు. ఆయనే అమెరికా మూడో అధ్యక్షుడిగా వ్యవహరించి.. స్వాతంత్ర్య దినోత్సవం రోజునే 1826లో జులై 4న మృతి చెందారు.
* అమెరికా 2వ అధ్యక్షుడిగా పనిచేసిన జాన్ ఆడమ్స్ (1826 జులై 4 ), 5వ అధ్యక్షుడిగా వ్యవహరించిన జేమ్స్ మొన్రే (1831 జులై 4) కూడా అమెరికా స్వాతంత్ర దినోత్సవం రోజునే మరణించారు.
* అమెరికా జాతీయ పతాకంలో స్టార్స్ ఇప్పుడు ఉన్న క్రమంలో ఉండేవి కావు. 1776నాటి పతాకంలోని స్టార్స్ వలయాకారంలో ఉండేవి. అమెరికాలోని అన్ని రాష్ట్రాలు సమానమే అని చాటి చెప్పేందుకు అలా డిజైన్ చేశారట.
* ఏటా అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రోడె ఐలాండ్స్లోని బ్రిస్టోల్లో భారీ పరేడ్ నిర్వహిస్తారు. ఈ సారి కరోనా కారణంగా నిర్వహించట్లేదు.
* మొదట్లో అమెరికాకు స్వాతంత్ర్య దినోత్సవం సెలవు దినంగా ఉండేది కాదు. 1870లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవం రోజున సెలవు ప్రకటించింది. ఆ తర్వాత 1941 నుంచి వేతనంతో కూడిన సెలవుగా మార్చారు.
* ఈ రోజున అమెరికా అంతటా బాణ సంచాలు కాలుస్తుంటారు. ఇవే ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణంగా ఉంటాయి. ఏటా దేశవ్యాప్తంగా ఈ వేడుకల్లో బాణసంచాల కోసం రూ. 1800 కోట్లు ఖర్చు చేస్తారట.
* జులై 4న అమెరికన్ వాసులంతా ఎక్కువగా హాట్డాగ్(సాండ్విచ్)ను బాగా తింటారట. ఒక్క రోజులోనే సుమారు 15 కోట్ల హాట్డాగ్స్ను లాగించేస్తారట.
* హాలీవుడ్లో చాలా సినిమాలు అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలయ్యాయి. అయితే వాటిలో టాప్ 20 సినిమాలు తీసుకుంటే.. అందులో ఐదు సినిమాల్లో విల్స్మిత్ నటించినవే ఉన్నాయి. అందుకే ఆయన్ను ఇండిపెండెన్స్ డే ఓపెనర్ అంటుంటారు.
* అమెరికాలో అంతర్యుద్ధం తర్వాత కొన్ని రాష్ట్రాల్లో నల్లజాతీయులు జులై 4ను ‘బ్లాక్ ఫ్రీడమ్’గా జరుపుకొన్నారు. ఈ క్రమంలో 1875 జులై 4న నల్లజాతీయులు నిర్వహించిన ఓ ర్యాలీలో ఘర్షణ నెలకొంది. ఆ తర్వాత 19 శతాబ్దం ముగిసేనాటికి ‘బ్లాక్ ఫ్రీడం’ వేడుకలు అంతరించిపోయాయి.
* 1776 జులై 4న బ్రిటన్ నుంచి అమెరికాకు స్వాతంత్ర్యం వస్తే.. 1946 జులై 4న అమెరికా నుంచి ఫిలిప్పీన్స్కు స్వాతంత్ర్యం వచ్చింది. నిజానికి ఫిలిప్పీన్స్కు స్పెయిన్ నుంచి 1898 జూన్ 12న స్వేచ్ఛ లభించింది. కానీ స్పెయిన్తో జరిగిన యుద్ధంలో అమెరికా గెలిచి ఫిలిప్పీన్స్పై అధికారం దక్కించుకుంది. ఆ తర్వాత ‘ట్రీటీ ఆఫ్ మనీలా’ ఒప్పందం ప్రకారం ఫిలిప్పీన్స్పై అధికారాన్ని అమెరికా వదులుకుంది. అయినా ఫిలిప్పీన్స్ జూన్ 12నే స్వాతంత్ర్య వేడుకలు నిర్వహిస్తోంది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా