రిపేర్ కేఫ్.. మీ దగ్గరకే వస్తుంది..
ఈ కాలం మనుషుల్లో ఒక వస్తువును పూర్తిగా వాడుకునే ఓపిక లేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఓ వస్తువు పాడవుతే.. దానికి మరమ్మతులు చేసి వాడుకునే అవకాశమున్నా.. దాన్ని పక్కకు పెట్టేసి కొత్తది కొనుగోలు చేస్తుంటారు. అలా ప్రతి ఒక్కరి ఇంట్లో ఎన్నో వస్తువులు
ఇంటర్నెట్ డెస్క్: ఈ కాలం మనుషుల్లో ఒక వస్తువును పూర్తిగా వాడుకునే ఓపిక లేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఓ వస్తువు పాడైతే.. దానికి మరమ్మతులు చేసి వాడుకునే అవకాశమున్నా.. పక్కకు పెట్టేసి కొత్తది కొనుగోలు చేస్తుంటారు. అలా ప్రతి ఒక్కరి ఇంట్లో ఎన్నో వస్తువులు మూలకు పడి ఉంటాయి. వాటిని మరమ్మతులు చేయించాలంటే అనేక రిపేర్ షాపులకు తిరగాల్సి ఉంటుంది. అందుకే అలాంటి ఇబ్బంది లేకుండా బెంగళూరులో ‘రిపేర్ కేఫ్’ పేరుతో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటైంది. ప్రతి ఆదివారం ఓ ప్రాంతానికి వెళ్లి వర్క్షాప్ నిర్వహిస్తుంటుంది. అందులో స్థానిక ప్రజల వద్ద ఉండే పాడైన వస్తువులను మరమ్మతులు చేసి ఇస్తోంది. కరోనా ఆంక్షలతో వర్క్షాప్ నిర్వహించలేని చోట ఆన్లైన్ క్లాసుల ద్వారా మరమ్మతులు సొంతగా ఎలా చేసుకోవాలో నేర్పిస్తోంది.
పూర్ణ సాకర్ అనే యువతి తన స్నేహితులతో కలిసి 2015లో ఈ ‘రీపేర్ కేఫ్’ను ఏర్పాటు చేసింది. ఇందులో ఇంజినీర్లు, టైలర్లు, మెకానిక్లు, స్వర్ణకారులు, ఎలక్ట్రిషియన్లు, ప్లంబర్లు ఇలా అనేక మంది వాలంటీర్లుగా పాల్గొంటుంటారు. దీంతో బైక్ నుంచి ఐరన్ బాక్స్ వరకు అన్ని రకాల మరమ్మతులు చేసేవారు ఈ రీపేర్ కేఫ్లో అందుబాటులో ఉంటారు. వీరంతా సోషల్మీడియా ద్వారా ఆదివారం రోజున ఏ ప్రాంతంలో వర్క్షాపు నిర్వహించబోతున్నారో ముందే సమాచారం ఇస్తారు. దీంతో ఆ రోజున అక్కడి ప్రజలు తమ ఇళ్లలో ఉండే పాడైన వస్తువుల్ని తీసుకొచ్చి వారి వద్ద మరమ్మతులు చేయించుకోవచ్చు. అయితే, ఇందుకోసం నామమాత్రం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
లాక్డౌన్తో ఆన్లైన్ బాట..!
అన్ని రకాల సేవలు ఒక్క చోటనే ఉండటంతో బెంగళూరు ప్రజల నుంచి ఈ రిపేర్ కేఫ్కు మంది ఆదరణ లభించింది. కానీ, కరోనా.. లాక్డౌన్ వల్ల మునపటిలా వర్క్షాప్లు ఏర్పాటు చేయడం సాధ్యపడట్లేదు. ఆంక్షలు సడలించినప్పుడో.. వీలు కుదిరినప్పుడో అడపాదడపా వర్క్షాప్ నిర్వహించగలుగుతున్నారు. దీంతోపాటు ఆన్లైన్ ద్వారా సేవలు కొసాగించాలని రిపేర్ కేఫ్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి ఆదివారం పిల్లలు, పెద్దల కోసం రెండు రకాల ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. వీటి ద్వారా బొమ్మలు, చిన్న వస్తువులకు సొంతగా మరమ్మతు ఎలా చేయాలో చిన్నారులకు నేర్పిస్తున్నారు. కంప్యూటర్, బైకు వంటి వాటికి వీలైనంత వరకు సొంతగా మరమ్మతులు చేసుకునేలా పెద్దలకు శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్లో కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆరాటం ఎక్కువగా ఉంటుంది. అందుకే చిన్నారులు ఆన్లైన్ క్లాసుల్లో చురుగ్గా పాల్గొంటున్నారట. పిల్లలతోపాటు పెద్దలూ ఈ ఆన్లైన్ క్లాసులకు హాజరవుతూ రిపేర్ కేఫ్ సేవలను వినియోగించుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో మరో ఇద్దరు అధికారులపై బదిలీ వేటు
ఆంధ్రప్రదేశ్లో మరో ఇద్దరు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
ఎండ వేడిమికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వరుణుడు కాస్త ఉపశమనం కలిగించాడు. ఏపీలోని పలు జిల్లాల్లో మంగళవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో భారీ వర్షం.. పలు చోట్ల ట్రాఫిక్ జామ్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడదులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. -
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ న్యాయస్థానం పొడిగించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
నాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలుపుతూ నాని పోస్ట్ పెట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దావత్ కావాలా నాయనా!.. వ్యవసాయ క్షేత్రాల్లో కార్యకర్తల ఖుషీ
ఎన్నికల పండుగొచ్చింది.. దావత్ల మీద దావత్లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. -
ఆదర్శ కేంద్రం.. ఓటుకు కదులుదాం
లోక్సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఇంకా రెండు రోజులే!
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోగా.. ఇప్పటి వరకు 5,200 మంది మాత్రమే వినియోగించుకున్నారు. -
రూ.2 చెల్లించు.. ఛాలెంజ్ ఓటేయ్
ఛాలెంజ్ ఓటు.. దీని గురించి ఎన్నికల సమయంలో వింటుంటాం. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 చట్టంలోని సెక్షన్ 49ఏలో వివరాలు ఉంటాయి. పలు సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేస్తారు. -
భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ
మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య