టమోటా విషమన్నారు.. కోర్టులో కేసు వేశారు
ప్రతి ఇంట్లో నిత్యం కనిపించే కూరగాయ టమోటా.. దీన్ని అన్ని కూరల్లో వేసుకోవచ్చు.. దీన్నే కూరగా వండుకోవచ్చు. అంతేనా టమోటా పచ్చడి, టమోటా రసం, టమోటా సూప్ అంటూ రకరకాల వంటకాలు చేయొచ్చు. ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సిన అనేక పోషకాలు
ప్రతి ఇంట్లో నిత్యం కనిపించే కూరగాయ టమోటా. దీన్ని అన్ని కూరల్లో వేసుకోవచ్చు.. దీన్నే కూరగా వండుకోవచ్చు. అంతేనా టమోటా పచ్చడి, టమోటా రసం, టమోటా సూప్ అంటూ రకరకాల వంటకాలు చేయొచ్చు. ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సిన అనేక పోషకాలు దీంట్లో ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ ‘సి’ సమృద్ధిగా ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యమున్న టమోటాను గతంలో కేవలం ఓ అలంకార వస్తువుగా ఉపయోగించేవారట. ఆ తర్వాత తినేందుకు ప్రయత్నిస్తే విషమని ప్రచారం చేశారు. ఏకంగా కోర్టులో కేసు కూడా వేశారు. చివరికి ఆ టమోటానే ఇప్పుడు అత్యధిక మంది కొనుగోలు చేస్తున్న కూరగాయగా నిలుస్తోంది.
టమోటాలు మొదట మెక్సికో, దక్షిణ అమెరికాలోని పలు ప్రాంతాల్లో పండేవి. అక్కడి నుంచి స్పెయిన్కి చెందిన కొందరు యాత్రికులు వీటిని 1519లో యూరప్కి తీసుకొచ్చారు. మొదట్లో ఈ టమోటాలు అలంకారంగా ఉంటాయని టమోటా చెట్లను ఇంటి పరిసరాల్లో నాటేవారు. అయితే కొన్నాళ్ల తర్వాత కొందరు పాకశాస్త్ర నిపుణులు ఈ చెట్లకు కాసే టమోటాలను వంటకాల్లో ఉపయోగించడం మొదలుపెట్టారు. అవి రుచిగా ఉండటంతో ప్రజలు కూడా వాటిని తినడం ప్రారంభించారు. అయితే 17వ శతాబ్దంలో ఈ పండ్లలో టోమాటిన్ అనే విషపూరిత రసాయనం ఉందని కొందరు వృక్షశాస్త్రవేత్తలు కనుగొన్నారు. వారు చెప్పింది నిజమే.. కానీ టోమాటిన్ అంత ప్రమాదకరమైన రసాయనం కాదు. అది కేవలం టమోటా చెట్ల కొమ్మల్లో.. ఆకుల్లో మాత్రమే ఎక్కువగా ఉంటుంది. టమోటా కాయల్లో స్వల్ప మొత్తంలో మాత్రమే ఉంటుందట, పండుగా మారిన తర్వాత అందులోని యాసిడిక్ రసాల వల్ల టోమాటిన్ నిర్వీర్యం అవుతుందట. అయినా టమోటాలు విషపూరితమేనని భావించి.. తినడానికి విముఖత చూపడం మొదలుపెట్టారు. దాన్ని ‘పాయిజన్ యాపిల్’ అని పేరు పెట్టారు.
టమోటాపై కేసు
అక్కడి ప్రజల వాదనలను అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన రాబర్ట్ గిబ్బన్ జాన్సన్ అనే ఉద్యానవనవేత్త, రైతు నమ్మలేదు. టమోటాలను తినొచ్చని బాగా విశ్వసించాడు. ఈ మేరకు 1808లో విదేశాల నుంచి ఈ టమోటాలను న్యూజెర్సీలోని సాలెంకు తీసుకొచ్చి పండించడం ప్రారంభించాడు. టమోటా సాగులో పోటీలు పెట్టి ఎవరు ఎక్కువ టమోటాలను పండిస్తారో వారికి బహుమతులుచ్చేవాడు. టమోటాలను జాన్సన్ పండించడంపై 1820లో కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ అంశంపై కోర్టులో కేసు వేశారు. టమోటాలు విషపూరితమని, వాటిని కేవలం అలంకారానికి ఉపయోగించాలని గానీ తినడమేంటని వాదించారు.
దీంతో టమోటా విషపూరితమని భావించేవారి నోళ్లు మూయించాలని భావించిన జాన్సన్ కోర్టు విచారణ రోజున ఓ బుట్ట నిండా టమోటాలను తీసుకొచ్చాడు. రెండు వేల మంది చూస్తుండగా ఆ టమోటాలను మొత్తం తినేశాడు. అతడికి ఏం కాకపోవడంతో అందరికి టమోటా తినొచ్చని నమ్మకం కలిగింది. అలా అమెరికాలో టమోటా తినే కూరగాయేనని నిరూపితమైంది. అయితే అదే సమయంలో ప్రపంచంలోని కొన్ని దేశాల్లో టమోటాపై ఎలాంటి చర్చలు లేకుండా వంటకాల్లో ఉపయోగించేవారు. 16 శతాబ్దంలో పోర్చుగీసు వ్యాపారుల ద్వారా మన దేశానికి టమోటాను పరిచయమై పలు ప్రాంతాలకు విస్తరించింది. అనంతరం బ్రిటీష్పాలనలో మన దేశంలో టమోటా సాగు బాగా పెరిగింది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా