ఆర్టీసీ పయనమంటేనే అమ్మో..!
వర్షాకాలంతో అధ్వానంగా మారిన రోడ్లు, కాలం గడిచిపోయిన ఆర్టీసీ బస్సులు.. వెరసి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన ప్రయాణికుల్లో అధికమవుతోంది.
అమరావతి: వర్షాకాలంలో అధ్వానంగా మారిన రోడ్లు, కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన ప్రయాణికుల్లో అధికమవుతోంది. క్షేమంగా గమ్యస్థానాలకు చేరతామో.. లేదో తెలియని పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ ప్రయాణికులది. ఇటీవల వరుస ప్రమాదాలు దీనికి ఉదాహరణలు. ఏటా 2 వేల కొత్త బస్సులు రావాల్సి ఉన్నా.. నిధులు రాక పాత బస్సులకే మరమ్మతులు చేసి ఆర్టీసీ నడిపిస్తోంది.
ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల ప్రమాదాలు చూశాక వాటిలో ప్రయాణమంటేనే ప్రజలు ఆలోచిస్తున్నారు. గుంతలమయమైన రోడ్లపై కాలం చెల్లిన బస్సుల్ని నడుపుతుండటం వల్ల ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి ఘోరంగా తయారవడంతో ఆటోలు, ప్రైవేటు వాహనాలు నిలిపేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో కండిషన్లో లేని ఆర్టీసీ బస్సులు ఎక్కుతున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తోంది.
నిబంధనల ప్రకారం 10 లక్షలకు పైగా తిరిగిన బస్సులను ఆర్టీసీ పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఆర్టీసీకి 9,039 సొంత బస్సులుండగా.. అందులో 10 లక్షల కిలోమీటర్లకు పైగా 4,588 బస్సులు తిరిగాయి. 12 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన 2,800 బస్సులను సరకు రవాణాకు తరలించాల్సి ఉన్నా.. కొత్త బస్సులు లేకపోవడంతో పాత బస్సులకే రంగులేసి.. మరమ్మతులు చేసి సర్వీసులు నడిపిస్తున్నారు. ఏటా 2 వేల కొత్త బస్సుల కొనుగోలుకు రూ.300 కోట్ల వరకు కేటాయించే ప్రభుత్వం.. కొన్నేళ్లుగా దానిని నిలిపేసిందని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవాటిని తీసుకురాకపోతే.. ఏదైనా అనర్థం జరిగితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
తెలంగాణలో ఇంటర్ పరీక్ష ఫలితాలు ప్రకటించిన రోజే ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం తనను కలచివేసిందని ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?
తాజా వార్తలు (Latest News)
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి