30నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 30వ తేదీ నుంచి సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌

Published : 27 Nov 2020 01:12 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 30వ తేదీ నుంచి సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ పేరిట అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్‌ జారీ చేశారు. 30వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు. ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని