సినిమా థియేటర్లు తెరవాలని కేంద్రానికి వినతి
కరోనా లాక్డౌన్ సందర్భంగా మూతపడ్డ సినిమా థియేటర్లు ఇంతవరకూ తెరచుకోలేదు. సినిమా పరిశ్రమను నమ్ముకున్నవారు ఉపాధి లేక దాదాపు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉండగా ఇటీవల
దిల్లీ: కరోనా లాక్డౌన్ సందర్భంగా మూతపడ్డ సినిమా థియేటర్లు ఇంతవరకూ తెరచుకోలేదు. సినిమా పరిశ్రమను నమ్ముకున్నవారు ఉపాధి లేక దాదాపు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉండగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం సినిమా చిత్రీకరణకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై మాత్రం విముఖత వ్యక్తం చేసింది. అయితే, లక్షల మంది చిరుద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో థియేటర్ల పునఃప్రారంభానికి ప్రభుత్వం అనుమతివ్వాలని ఎమ్ఏఐ (మల్టీప్లెక్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా) కేంద్రానికి లేఖ రాసింది. ‘కరోనా లాక్డౌన్ వల్ల దాదాపు రూ.9వేల కోట్లు నష్టం వాటిల్లింది. అన్నింటికంటే ముందు సినిమా థియేటర్లనే మూసేశారు. ప్రస్తుతం అన్ని కార్యాలయాలు, దుకాణాలు, రెస్టారెంట్లు, రైల్వే సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. థియేటర్లు మాత్రం తెరచుకోలేదు. థియేటర్లు మూతపడటం వల్ల నెలకు రూ.1,500కోట్లు నష్టపోవాల్సి వస్తోంది. ప్రపంచంలో 80దేశాలకు పైగా సినిమా థియేటర్లకు అనుమతులిచ్చాయి. లక్షలాది మంది కార్మికుల కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని థియేటర్ల పునఃప్రారంభానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి’ అని ఎంఏఐ కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..