ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్‌పై ఐఎఫ్‌ఎస్‌ అధికారుల ఫిర్యాదు

ఆసిఫాబాద్ పాలనాధికారి సంజయ్ కుమార్ ఝాపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవీశాఖ అధికారులు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఫిర్యాదు...

Updated : 19 Jul 2020 13:01 IST

కుమురం భీం:  ఆసిఫాబాద్ పాలనాధికారి సందీప్‌ కుమార్ ఝాపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవీశాఖ అధికారులు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ తమను తీవ్ర స్థాయిలో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆసిఫాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో దురుసుగా మాట్లాడి తమను కించపరిచారని ఆరోపించారు. ఐఎఫ్‌ఎస్‌ స్థాయి అధికారులని కూడా చూడకుండా పరుషంగా దుర్భాషలాడారని వాపోయారు. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వారికి భరోసా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని