‘పత్తి కొనుగోళ్లపై ఆంక్షలు ఎత్తివేయండి’
ఆంక్షల పేరుతో పత్తి రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) సీఎండీకి ..
సీసీఐ ఎండీకి మంత్రి నిరంజన్రెడ్డి లేఖ
హైదరాబాద్: ఆంక్షల పేరుతో పత్తి రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) సీఎండీకి ఆయన లేఖ రాశారు. పత్తి కొనుగోలుకు ప్రస్తుతం సీజన్ నడుస్తున్నందున రోజువారీ గరిష్ఠ పరిమితి తొలగించి.. మార్కెట్కు వస్తున్న మొత్తం పత్తిని కొనుగోలు చేయాలని నిరంజన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కీలక సమయమని.. ఆంక్షలు విధించడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారని లేఖలో ఆయన పేర్కొన్నారు. వరంగల్, మహబూబ్నగర్ రీజియన్లలో రోజుకు 15వేల బేళ్లు, ఆదిలాబాద్ రీజియన్లో రోజుకు 10వేల బేళ్లు మాత్రమే కొనాలని అధికారులకు సీసీఐ ఆదేశాలిచ్చిందని, దీని వల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని మంత్రి సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. నిల్వ సామర్థ్యం లేని కొనుగోలు కేంద్రాలు ఉన్న చోట నుంచి సమీప కేంద్రాలకు రైతులను మళ్లించే విధంగా చర్యలు తీసుకుంటామని.. కొనుగోళ్లు మాత్రం పెంచాలని నిరంజన్రెడ్డి కోరారు. ప్రస్తుతం విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు