భౌతిక దూరంతోనే...వైరస్ దూరం..!
నూతన మ్యాథమెటికల్ మోడల్ను అనుసరించి గాలిలో వైరస్ ప్రసారాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంచేశారు. గాలిలో వైరస్ ప్రసరించినప్పటికీ.. భౌతిక దూరం ఎక్కువ ఉంటే.. వైరస్ ముప్పు తగ్గుతుందనే విషయాన్ని మరోసారి సాంకేతికంగా గుర్తించారు.
గాలిలో వైరస్ వ్యాప్తి అంచనాకు నూతన పద్ధతి
వాషింగ్టన్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ కొంతవరకు గాలి ద్వారాను వ్యాపిస్తుందని అంతర్జాతీయ పరిశోధన సంస్థలు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, గాలిలో వైరస్ ఎంతదూరం ప్రయాణిస్తుంది..? దాని ప్రభావమెంత? అనే అంశాలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు కూడా నూతన మ్యాథమెటికల్ మోడల్ను అనుసరించి గాలిలో వైరస్ ప్రసారాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంచేశారు. గాలిలో వైరస్ ప్రసరించినప్పటికీ.. భౌతిక దూరం ఎక్కువ ఉంటే.. వైరస్ ముప్పు తగ్గుతుందనే విషయాన్ని మరోసారి సాంకేతికంగా గుర్తించారు. అంతేకాకుండా, సాధారణ మాస్కుతోనూ వైరస్ బారినపడకుండా నివారించవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు మరోసారి స్పష్టంచేశారు. తాజా పరిశోధన ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ జర్నల్లో ప్రచురితమైంది.
‘భౌతిక దూరాన్ని పెంచినట్లయితే.. రక్షణ కూడా పెరుగుతుంది’ అని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన భారత సంతతి వ్యక్తి రజత్ మిత్తల్ పేర్కొన్నారు. విధాన రూపకల్పనలో ఇలాంటి కొలమానం, నియమం ఎంతో దోహదపడుతుందని ఆయన స్పష్టంచేశారు. గాలిలో వైరస్ వ్యాప్తిపై పరిశోధనలు జరుపుతోన్న శాస్త్రవేత్తల బృందంలో ఆయన కూడా ఒకరు. అయితే, వైరస్ సోకినవారిలో శారీరక శ్రమ వల్ల శ్వాసక్రియ రేటు పెరగడం, తద్వారా వైరస్ వ్యాప్తి ఎక్కువయ్యే ప్రమాదాన్ని గుర్తించామని రజత్ తెలిపారు. పాఠశాలలు, జిమ్లు, మాల్స్ వంటి ప్రదేశాలు తిరిగి ప్రారంభిస్తోన్న నేపథ్యంలో వీటిని పరిగణలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకతను మరోసారి గుర్తుచేశారు. అయితే, జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ముఖ మాస్కుల ప్రభావం, వైరస్ ప్రసారం వంటి అంశాలపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఫ్లూయిడ్ డైనమిక్స్ భావనను అనుసరించి..గాలి ద్వారా వివిధ అంటువ్యాధులు సంక్రమించే పరిధిని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కొవిడ్-19తోపాటు ఫ్లూ, క్షయ, మెజిల్స్ వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు కూడా ఇదే తరహాలో వ్యాపిస్తాయని పేర్కొన్నారు. భౌతిక దూరం, మాస్కుల వల్ల వాటిన్నింటినుంచి సాధ్యమైనంత వరకు బయటపడవచ్చని సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?