Telangana Tourism: ఆహ్లాదం వైపు అడుగులు.. పుంజుకుంటున్న పర్యాటకం..
కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న పర్యాటకం క్రమంగా పుంజుకుంటోంది. ముఖ్యంగా రెండోదశ ఉద్ధృతి సమయంలో
ఈనాడు, హైదరాబాద్: కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న పర్యాటకం క్రమంగా పుంజుకుంటోంది. ముఖ్యంగా రెండోదశ ఉద్ధృతి సమయంలో ఇళ్లకే పరిమితమైనవాళ్లు.. ప్రస్తుతం కేసుల సంఖ్య తక్కువగా ఉండటంతో బయటకొస్తూ, ఆహ్లాదం వైపు అడుగులు వేస్తున్నారు. వర్షాలు బాగా కురవడంతో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. చెరువులు, నదుల్లో జనం బోటు షికార్లతో సందడి చేస్తున్నారు. భయాన్ని వీడి హోటళ్లలో బస చేస్తున్నారు. పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన ‘హరిత’ హోటళ్లతోపాటు బోటింగ్ ఆదాయం రెండు, మూడు నెలలుగా గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనం. ఏప్రిల్, మేలలో రెండోదశ కరోనా, జూన్లో లాక్డౌన్ పర్యాటకంపై ప్రతికూల ప్రభావం చూపాయి. మే 12 నుంచి జూన్ 19 వరకు పర్యాటక హోటళ్లను, బోటింగ్ను నిలిపివేశారు. జులై నుంచి జనం బయటకొస్తుండటంతో రాష్ట్రంలో అన్నిప్రాంతాల్లో పర్యాటకం పెరుగుతోంది. జులై - సెప్టెంబరు వరకు 3 నెలలపాటు 20 శాతం రాయితీ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం కూడా ‘హరిత’ హోటళ్లలో గదుల బుకింగ్ గణనీయంగా పెరిగేందుకు దోహదపడిందని పర్యాటక శాఖ వర్గాలు చెబుతున్నాయి.
హుస్సేన్సాగర్ తర్వాత కోమటిచెరువే..
నాగార్జునసాగర్, హుస్సేన్సాగర్, సోమశిల, సింగూరు, పాకాల, కడెం, ఎల్ఎండీ కరీంనగర్, కిన్నెరసాని, దుర్గంచెరువు, కోమటిచెరువు, లక్నవరం.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 27 చోట్ల బోటింగ్ సదుపాయం ఉంది. జూన్-ఆగస్టు 3 నెలల్లో 3,29,817 మంది బోటింగ్ చేశారు. అత్యధికంగా హుస్సేన్సాగర్లో 2,07,599 మంది కాగా, ఆ తర్వాత మంత్రి హరీశ్రావు ప్రత్యేకశ్రద్ధతో అభివృద్ధి చేసిన సిద్దిపేట కోమటిచెరువు 66,797 మందితో రెండోస్థానంలో ఉండటం విశేషం.
మంచిరోజులు వస్తున్నాయ్
తెలంగాణలో పర్యాటకానికి మంచిరోజులు వస్తున్నాయి. కొన్ని హోటళ్లలో అయితే కొవిడ్కు ముందుకంటే ఎక్కువ ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. రామప్ప ఆలయానికి, కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చే వారి సంఖ్య భవిష్యత్తులో గణనీయంగా పెరగనుంది. ఆ మేరకు సౌకర్యాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తాం.-శ్రీనివాస్గుప్తా, ఛైర్మన్, పర్యాటక అభివృద్ధి సంస్థ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?