పొలంలో వినాయకుని రూపం..ఎలాగో చూడండి
మాయదారి కరోనా మనిషి జీవితంపై ఎంతగానో ప్రభావం చూపింది. శుభకార్యాల దగ్గర నుంచి సంప్రదాయంగా జరుపుకునే పండగల వరకు ప్రతి వేడుకకు ఆటంకమే. ఈ మహమ్మారి కారణంగా ప్రతి ఏడాది....
ముంబయి: మాయదారి కరోనా మనిషి జీవితంపై ఎంతగానో ప్రభావం చూపింది. శుభకార్యాల దగ్గర నుంచి సంప్రదాయంగా జరుపుకొనే పండగల వరకు ప్రతి వేడుకకు ఆటంకమే. ఈ మహమ్మారి కారణంగా ప్రతి ఏడాది చిన్నా పెద్దా అంతా ఒక్కచోట చేరి ఎంతో వేడుకగా చేసుకునే వినాయకుడి ఉత్సవాలు కూడా ఇళ్లలోనే జరుపుకోవాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. మరోవైపు ప్రజలంతా మట్టి విగ్రహాలను ఆరాధించాలని పర్యవరణవేత్తలు సూచిస్తున్నారు. దీంతో మట్టితో చేసిన వినాయకుల వైపే ఎంతో మంది మొగ్గు చూపుతున్నారు.
ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని షోలాపూర్ దగ్గర్లోని బాలా గ్రామానికి చెందిన ప్రతీక్ తండాలే అనే యువ ఆర్టిస్ట్ విన్నూత్నంగా ఆలోచించాడు. పండుగకు కొద్ది రోజుల ముందుగా పొలంలో తన స్నేహితుల సహాయంతో వినాయకుడిని రూపాన్ని గీసి, అందులో విత్తనాలను చల్లి పంట పండించాడు. 200 అడుగుల పొడువు, 100 అడుగుల వెడల్పు ఉన్న ఈ భారీ ఎకోఫ్రెండ్లీ వినాయకుడు చూసిన వారంతా ప్రతీక్ ఆలోచనను అభినందిస్తున్నారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూడా ఈ వీడియోను రీట్వీట్ చేశారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
దీని గురించి ప్రతీక్ మాట్లాడుతూ‘‘ కరోనా కారణంగా ప్రతి ఏడాదిలా వినాయకచవితిని జరుపుకోలేకపోతున్నాం. భౌతిక దూరం, ఎక్కువ మంది ఒక చోట చేరకూడదు లాంటి ఎన్నో నిబంధనలు పాటించాలి. అందుకే ఎక్కువ మంది ఒక చోటకి రాకుండా, దూరం నుంచి చూసినా కనిపించేలా ఏదైనా చేయాలనుకున్నాను. పంటతో వినాయకుడిని రూపొందించాలని నిర్ణయించుకుని మిత్రుల సహకారం తీసుకున్నాను. సుమారు 45 రోజుల పాటు శ్రమించి మేమంతా ఈ ఎకోఫ్రెండ్లీ వినాయకుడిని రూపొందించాం. మొదటి రెండు ఫలితాల్లో మేం అనుకున్నది సాధించలేకపోయాం. మూడో ప్రయత్నంలో విజయం సాధించాం’’ అని తెలిపాడు. ప్రతీక్, అతడి మిత్రులు కలిసి రూపొందించిన ఈ ఎకోఫ్రెండ్లీ వినాయకుడిని చూసిన నెటిజన్లు వారిని అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం.. కరీంనగర్లో కూలిన టెంట్లు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడదులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. -
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ న్యాయస్థానం పొడిగించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
నాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలుపుతూ నాని పోస్ట్ పెట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దావత్ కావాలా నాయనా!.. వ్యవసాయ క్షేత్రాల్లో కార్యకర్తల ఖుషీ
ఎన్నికల పండుగొచ్చింది.. దావత్ల మీద దావత్లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. -
ఆదర్శ కేంద్రం.. ఓటుకు కదులుదాం
లోక్సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఇంకా రెండు రోజులే!
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోగా.. ఇప్పటి వరకు 5,200 మంది మాత్రమే వినియోగించుకున్నారు. -
రూ.2 చెల్లించు.. ఛాలెంజ్ ఓటేయ్
ఛాలెంజ్ ఓటు.. దీని గురించి ఎన్నికల సమయంలో వింటుంటాం. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 చట్టంలోని సెక్షన్ 49ఏలో వివరాలు ఉంటాయి. పలు సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేస్తారు. -
భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ
మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
-
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
-
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి
-
టాప్ 5 మలయాళీ చిత్రాలు.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?