Agnipath: విశాఖలో అగ్నివీరుల ఎంపిక ప్రారంభం.. తరలివచ్చిన అభ్యర్థులు

 కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అగ్నివీర్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ విశాఖలో ఆదివారం ఉదయం నుంచి మొదలైంది.

Published : 14 Aug 2022 16:39 IST

విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అగ్నివీర్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ విశాఖలో ఆదివారం ఉదయం నుంచి మొదలైంది. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ ర్యాలీకి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇవాళ్టి నుంచి ఈనెల 31 వరకు ర్యాలీ కొనసాగనుంది. స్టేడియంలో 24 గంటల పాటు విద్యుత్‌, నీటి సరఫరా సదుపాయం కల్పించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. రన్నింగ్‌ ట్రాక్‌పై నీరు, బురద లేకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ర్యాలీని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ మల్లిఖార్జున కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని