TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ. . మరో వ్యక్తి అరెస్టు
టీఎస్పీఎస్పీ పరీక్షాపత్రం లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది. రేణుక భర్త డాకియా ద్వారా ప్రశ్నాపత్రం పొందిన తిరుపతి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. రేణుక భర్త డాకియా ద్వారా ఏఈ ప్రశ్నాపత్రం పొందిన తిరుపతి అనే వ్యక్తిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఇతడు ఆ ప్రశ్నాపత్రాన్ని రాజేందర్కు విక్రయించినట్టు తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో అతడిని నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. దీంతో ఈ వ్యవహారంలో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 15కి చేరింది. మరోవైపు, ఏఈ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంతో సమాంతరంగానే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ లీకేజీ అంశంపై సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని రాజశేఖర్ రెడ్డి తన బావ ప్రశాంత్కు విక్రయించగా.. అతడు న్యూజిలాండ్ నుంచి హైదరాబాద్కు వచ్చి గతేడాది అక్టోబర్ 16న గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినట్టు నిర్థారించుకున్నారు. ఈ పరీక్షలో ప్రశాంత్కు 100కు పైగా మార్కులు వచ్చినట్టు గుర్తించారు. అయితే, నిందితుడు రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ప్రశాంత్కు సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్ అధికారులు ఓ వైపు నిందితులను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తూనే మరోవైపు, 100 మార్కులకు పైగా వచ్చిన అభ్యర్థులను పిలిచి విచారిస్తున్నారు. టీఎస్పీఎస్సీ అధికారుల నుంచి వారి సమాచారం సేకరించి ఇప్పటివరకు 60మందికి పైగా అభ్యర్థులను పిలిచి విచారించగా.. మరికొందరిని ఫోన్లో సంప్రదించినట్టు సమాచారం. వీరిలో అనేకమంది అభ్యర్థులు చాలా సార్లు ప్రిలిమ్స్ రాయడం, ఎప్పటి నుంచో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారే ఉన్నట్టు తేలినట్టు తెలుస్తోంది. అయితే, అనుమానాస్పదంగా అనిపించిన వ్యక్తులను మాత్రం పిలిచి విచారిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..