Yadadri: యాదాద్రి కొండపైకి ఆటోలు.. రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి

దాదాపు రెండేళ్ల తర్వాత యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైకి ఆటోలను అనుమతించారు. ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదివారం జెండా ఊపి ఆటోలను ప్రారంభించారు.

Published : 11 Feb 2024 16:28 IST

యాదగిరిగుట్ట: దాదాపు రెండేళ్ల తర్వాత యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైకి ఆటోలను అనుమతించారు. ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదివారం జెండా ఊపి ఆటోలను ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి జిల్లా కలెక్టర్‌, డీసీపీ, ఆలయ ఈవోను ఆటో ఎక్కించుకొని ఎమ్మెల్యే స్వయంగా నడిపారు. గత పాలకులు రెండేళ్లుగా ఆటో కార్మికులను ఇబ్బందులకు గురి చేశారని బీర్ల మండిపడ్డారు. ఇప్పుడేమో వారి గురించి దొంగ ఏడుపు ఏడుస్తున్నారని విమర్శించారు. యాదాద్రి అభివృద్ధిలో భారీ అవినీతి జరిగిందని, ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లి విచారణ జరిపించాలని కోరుతామన్నారు. రెండేళ్ల తర్వాత కొండపైకి ఆటోలను అనుమతించడంతో ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని