ఉస్మానియా ఆస్పత్రికి అఖిలప్రియ
మియాపూర్ సమీపంలోని హఫీజ్పేటలో భూ వివాదం, కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను వైద్య పరీక్షల కోసం పోలీసులు
హైదరాబాద్: మియాపూర్ సమీపంలోని హఫీజ్పేటలో భూ వివాదం, కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను వైద్య పరీక్షల కోసం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం బాగాలేదని.. ఆస్పత్రిలో చూపించాలని అఖిలప్రియ జైలు అధికారులను కోరడంతో మధ్యాహ్నం ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆమెకు సీటీ స్కాన్, ఇతర వైద్య పరీక్షలు చేశారు. అనంతరం చంచల్గూడ మహిళా జైలుకు తరలించారు. నిన్న సికింద్రబాద్ కోర్టు కూడా అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.
కిడ్నాప్ కేసులో ప్రస్తుతం అఖిలప్రియ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. భూ వివాదం నేపథ్యంలో ప్రవీణ్రావు, సునీల్ రావు, నవీన్ రావు అనే ముగ్గురు సోదరులను కిడ్నాప్ చేసిన కేసులో అఖిలప్రియతోపాటు, ఆమె భర్త భార్గవరామ్,తెదేపా నేత ఏవీ సుబ్బారెడ్డి నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు రెండు రోజుల క్రితం కూకట్పల్లిలోని తన నివాసంలో అఖిలప్రియను పోలీసులు అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరు పరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఆమె చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?
తాజా వార్తలు (Latest News)
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..