BJP: జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలి: కె.లక్ష్మణ్
జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని.. ఆయన విగ్రహాన్ని ట్యాంక్బండ్పై ఏర్పాటుచేయాలని
హైదరాబాద్: జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని.. ఆయన విగ్రహాన్ని ట్యాంక్బండ్పై ఏర్పాటుచేయాలని భాజపా నేత, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ జాతి గర్వపడే విధంగా బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన ఆశాజ్యోతి సర్వాయి పాపన్న అని అన్నారు. నిజాం ఆగడాలపై వీరోచితంగా పోరాటం చేశారని గుర్తుచేశారు. బడుగుల రాజ్యాధికారం కోసం కృషి చేసిన మహనీయులు సర్వాయి పాపన్న అని కొనియాడారు. తెలంగాణ గడ్డపై స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమేనని గుర్తుచేశారు.
సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో నిజాం తరహా పాలనను కొనసాగిస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు. ‘‘తెలంగాణ యువత తిరగబడాల్సిన అవసరం ఉంది. భాజపాకు అండగా యువత పోరాటం చేసేందుకు ముందుకు రావాలి. కేసీఆర్ కుటుంబ పాలనకు యువత చరమగీతం పాడాలి. కేసీఆర్ పాలనను భూస్థాపితం చేయడమే.. సర్వాయి పాపన్నకు ఘనమైన నివాళి అవుతుంది’’ అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న జీవిత చరిత్ర పుస్తకాన్ని మాజీ ఎంపీ విజయశాంతితో కలిసి లక్ష్మణ్ ఆవిష్కరించారు. అంతకుముందు పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా ఎన్నికైన లక్ష్మణ్ను భాజపా శ్రేణులు సన్మానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు