Margadarsi: మార్గదర్శి మేనేజర్‌పై కేసు.. రిమాండ్‌ను తిరస్కరించిన న్యాయమూర్తి

రాజమహేంద్రవరం మార్గదర్శి మేనేజర్‌ రిమాండ్‌ను జిల్లా న్యాయమూర్తి తిరస్కరించారు.

Updated : 21 Aug 2023 17:12 IST

రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మార్గదర్శి బ్రాంచి మేనేజర్‌పై పెట్టిన కేసులో రిమాండ్‌ను జిల్లా న్యాయమూర్తి గంధం సునీత తిరస్కరించారు. గతంలోనూ ఇదే సెక్షన్లతో అరెస్టు చేశారని, నిందితుడి రిమాండ్‌ పూర్తయిందని అన్నారు. గత కేసులో ఛార్జిషీటు దాఖలు చేయలేదని, ఇప్పుడూ అవే సెక్షన్లతో మరో కేసు ఎలా నమోదు చేస్తారని పోలీసులను న్యాయమూర్తి ప్రశ్నించారు. కోర్టు ఆదేశాల మేరకు మేనేజర్‌ రవిశంకర్‌ను పోలీసులు విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని