CBI: నకిలీ మెడికల్ సర్టిఫికెట్ల స్కామ్.. తెలుగు రాష్ట్రాలు సహా 91 చోట్ల సీబీఐ సోదాలు
నకిలీ మెడికల్ సర్టిఫికెట్ల స్కామ్కు సంబంధించి ఏపీ, తెలంగాణ సహా దేశంలోని 91 చోట్ల గురువారం సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. నకిలీ సర్టిఫికెట్లు పొందిన వారి ఇళ్లతో పాటు మెడికల్ కౌన్సిల్ కార్యాలయాల్లో సోదాలు జరిపి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ నంబర్ల వ్యవహారంలో దేశ వ్యాప్తంగా 91 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించింది. విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్షలో ఫెయిల్ అయిన 73 మంది విద్యార్థులు సర్టిఫికెట్లు పొందారు. పలు స్టేట్ మెడికల్ కౌన్సిల్లో నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లతో ఈ సర్టిఫికెట్లు పొందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గుర్తించింది.
దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సునీల్ గుప్తా ఫిర్యాదుతో 420, 467, 468, 471 సహా పలు సెక్షన్ల కింద ఈనెల 21న సీబీఐ కేసు నమోదు చేసింది. తెలంగాణకు చెందిన ముగ్గురు, ఏపీకి చెందిన ఇద్దరు ఫారెన్ గ్రాడ్యుయేట్లను సైతం ఎఫ్ఐఆర్లో చేర్చింది. బిహార్ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ నంబర్ సర్టిఫికెట్ పొందిన వరంగల్ కాజీపేటకు చెందిన గుడిమళ్ళ రాకేష్ కుమార్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ నంబర్ పొందిన చేవెళ్ళకు చెందిన సితాలె శ్రీనివాసరావు, రాజస్థాన్ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ నంబర్ పొందిన బాగ్ లింగంపల్లికి చెందిన బొమ్మిరెడ్డి హరికృష్ణారెడ్డి, బిహార్ మెడికల్ కౌన్సిల్ నుంచి నకిలీ సర్టిఫికెట్ పొందిన విశాఖపట్నంకు చెందిన గొర్ల వెంకట్ రాజా వంశీ, విజయవాడ కొత్త పేటకు చెందిన మారుపిళ్ల శరత్ బాబును ఎఫ్ఐఆర్లో చేర్చారు. నకిలీ సర్టిఫికెట్లు పొందిన వారి ఇళ్లలో, జారీ చేసిన ఆయా మెడికల్ కౌన్సిల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలు చేసి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం దేశ వ్యాప్తంగా 15 మెడికల్ కౌన్సిళ్ల పేర్లను సీబీఐ ఎఫ్ఐఆర్లో పొందుపరిచింది. అర్హత లేకున్నా నకిలీ మెడికల్ కౌన్సిళ్ల సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులు ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నట్లు సీబీఐ గుర్తించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ న్యాయస్థానం పొడిగించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
నాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలుపుతూ నాని పోస్ట్ పెట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దావత్ కావాలా నాయనా!.. వ్యవసాయ క్షేత్రాల్లో కార్యకర్తల ఖుషీ
ఎన్నికల పండుగొచ్చింది.. దావత్ల మీద దావత్లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. -
ఆదర్శ కేంద్రం.. ఓటుకు కదులుదాం
లోక్సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఇంకా రెండు రోజులే!
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోగా.. ఇప్పటి వరకు 5,200 మంది మాత్రమే వినియోగించుకున్నారు. -
రూ.2 చెల్లించు.. ఛాలెంజ్ ఓటేయ్
ఛాలెంజ్ ఓటు.. దీని గురించి ఎన్నికల సమయంలో వింటుంటాం. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 చట్టంలోని సెక్షన్ 49ఏలో వివరాలు ఉంటాయి. పలు సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేస్తారు. -
భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ
మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్