ఆ మూడు ఫిర్యాదులపై నివేదిక ఇవ్వండి

ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్‌పై వచ్చిన ఫిర్యాదులపై కేంద్ర హోంశాఖ స్పందించింది. సునీల్‌ కుమార్‌ వ్యవహారంలో వచ్చిన మూడు ఫిర్యాదులపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై వివరాలు కోరుతూ ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌కు కేంద్ర హోంశాఖ కార్యదర్శి సంజీవ్‌ కుమార్‌ లేఖ రాశారు....

Updated : 03 Jul 2021 16:19 IST

ఎంపీ రఘురామ ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర హోంశాఖ

దిల్లీ: ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్‌పై వచ్చిన ఫిర్యాదులపై కేంద్ర హోంశాఖ స్పందించింది. సునీల్‌ కుమార్‌ వ్యవహారంలో వచ్చిన మూడు ఫిర్యాదులపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై వివరాలు కోరుతూ ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌కు కేంద్ర హోంశాఖ కార్యదర్శి సంజీవ్‌ కుమార్‌ లేఖ రాశారు. సునీల్‌కుమార్‌ సివిల్‌ సర్వీసెస్‌ నిబంధనలు ఉల్లంఘించారని గతంలో వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఐపీఎస్‌ హోదాలో ఉన్న అధికారి సమాజంలో అలజడి సృష్టించేలా మాట్లాడారని రఘురామ ఫిర్యాదు చేశారు. రఘురామ ఫిర్యాదు, సునీల్‌ ప్రసంగ వీడియోలను కేంద్ర హోంశాఖ రాష్ట్రానికి పంపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని