Polavaram: పోలవరం అంచనా వ్యయాన్ని ఏపీ ప్రభుత్వం పెంచేసింది: షెకావత్
పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచేసిందని కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు.
విశాఖపట్నం: పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచేసిందని కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. సవరించిన అంచనాలను గత నెల 19న కేంద్రానికి ఏపీ ప్రభుత్వం అందజేసిందని చెప్పారు. వీటిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. విశాఖ భాజపా కార్యాలయంలో షెకావత్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికి పోలవరానికి కావాల్సిన నిధులున్నాయని చెప్పిన ఆయన.. పునరావాస అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తే కేంద్రం పర్యవేక్షిస్తుందని షెకావత్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.