77th Independence Day: పరేడ్‌ గ్రౌండ్స్‌లో అమరవీరుల స్తూపం వద్ద సీఎం కేసీఆర్‌ నివాళి

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్స్‌లోని అమర వీరుల స్తూపం వద్ద అమర జవాన్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళి అర్పించారు. అంతకుముందు ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు.

Updated : 15 Aug 2023 10:36 IST

హైదరాబాద్‌: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో అమర వీరుల స్తూపం వద్ద అమర జవాన్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళి అర్పించారు. అంతకుముందు ప్రగతిభవన్‌లో నిర్వహించిన వేడుకల్లో సీఎం జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో సీఎంవో అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Modi: త్వరలో కొత్త పథకం.. ₹లక్షల్లో ప్రయోజనం: మోదీ

మరోవైపు స్వాతంత్య్ర వేడుకలకు గోల్కొండకోట సిద్ధమైంది. సీఎం కేసీఆర్‌ ఉదయం 11 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన ప్రసంగించే అవకాశముంది. కోట చుట్టూ ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు