Andhra News: సీపీఐ నేత నారాయణకు సతీ వియోగం

సీపీఐ నేత నారాయణకు సతీ వియోగం కలిగింది. ఆయన భార్య వసుమతిదేవి (67) కన్నుమూశారు...

Updated : 14 Apr 2022 22:02 IST

తిరుపతి: సీపీఐ నేత నారాయణకు సతీ వియోగం కలిగింది. ఆయన భార్య వసుమతిదేవి (67) కన్నుమూశారు. అనారోగ్యంతో తిరుపతిలోని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ గురువారం సాయంత్రం కన్నుమూశారు. రేపు నగరి మండలం ఐనంబాకంలో వసుమతిదేవి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

* సీపీఐ నేత నారాయణ సతీమణి వసుమతిదేవి మృతి పట్ల ఏపీ సీఎం జగన్‌ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

* సీపీఐ నేత నారాయణ సతీమణి వసుమతిదేవి మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. వసుమతి అనారోగ్యంతో మృతి చెందడం భాదాకరమన్నారు. నారాయణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు... ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

పవన్‌ సంతాపం

‘‘సీపీఐ నారాయణ సతీమణి వసుమతి మరణ వార్త విని ఆవేదనకు లోనయ్యాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. నారాయణ కుటుంబానికి నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ కష్ట సమయంలో నారాయణకు ఆత్మస్థైర్యం ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకొంటున్నాను’’ 

-పవన్‌ కల్యాణ్‌, జనసేన అధ్యక్షుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని