Delhi Liquor scam: శరత్‌ చంద్రారెడ్డికి పూర్తిస్థాయి బెయిల్‌ మంజూరు

శరత్‌ చంద్రారెడ్డికి దిల్లీ హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్‌ మంజూరు చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 08 May 2023 15:23 IST

దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన అరబిందో డైరెక్టర్‌ పెనక శరత్‌ చంద్రారెడ్డికి పూర్తిస్థాయి బెయిల్‌ మంజూరైంది. ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. తన భార్య అనారోగ్య కారణాల దృష్ట్యా శరత్‌ చంద్రారెడ్డి విజ్ఞప్తి మేరకు దిల్లీ హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దిల్లీ మద్యం కేసులో నగదు అక్రమ చలామణి వ్యతిరేక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఆయనను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: దిల్లీ మద్యం వ్యాపారంలో.. 30 శాతం శరత్‌ గుప్పిట్లోనే!

శరత్‌ చంద్రారెడ్డికి దిల్లీ రౌస్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల 4 వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. తిహాడ్‌ జైలులో ఉన్న శరత్‌చంద్రారెడ్డి.. తన భార్య అనారోగ్యం దృష్ట్యా ఆమెను చూసుకోవాలని, అందుకు 6 వారాలు బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ దీనిపై విచారణ చేపట్టారు. 4 వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేశారు. తన నాయనమ్మ అంత్యక్రియల నిమిత్తం బెయిల్‌ కోరుతూ శరత్‌చంద్రారెడ్డి జనవరి ఆఖరి వారంలో పిటిషన్‌ దాఖలుచేయగా నాడు ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు 14 రోజుల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. తాజాగా శరత్‌చంద్రారెడ్డికి పూర్తి స్థాయి బెయిల్‌ మంజూరు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని