Sarath Chandra Reddy: దిల్లీ మద్యం వ్యాపారంలో.. 30 శాతం శరత్ గుప్పిట్లోనే!
దిల్లీ మద్యం కుంభకోణంలో పెనక శరత్ చంద్రారెడ్డి కీలకంగా చక్రం తిప్పారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. దిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదికలో ఈడీ పలు అభియోగాలను ప్రస్తావించింది.
బినామీ కంపెనీలతో కలిసి 9 జోన్లు నిర్వహిస్తున్నారు
ఇప్పటివరకు రూ.64 కోట్లు మూటగట్టుకున్నారు
ఆయన భాగస్వామిగా ఉన్న సౌత్గ్రూప్ సిండికేట్
రూ.100 కోట్ల ముడుపులు ముట్టజెప్పింది
రిమాండ్ రిపోర్టులో ఈడీ వెల్లడి
ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణంలో పెనక శరత్ చంద్రారెడ్డి కీలకంగా చక్రం తిప్పారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. దిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదికలో ఈడీ పలు అభియోగాలను ప్రస్తావించింది. ‘దిల్లీ మద్యం విధానం ప్రకారం ఏ వ్యక్తి కూడా రెండు రిటైల్ జోన్లకు మించి నియంత్రించకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా శరత్చంద్రారెడ్డి తన గ్రూప్ అయిన ట్రైడెంట్ కెమ్ఫర్ ప్రైవేట్ లిమిటెడ్, బినామీ సంస్థలైన ఆగ్రానోమిక్స్ ఎకో సిస్టమ్స్, శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ ద్వారా 5 రిటైల్ జోన్లను నియంత్రిస్తున్నారు. శరత్ చంద్రారెడ్డి పెట్టుబడుల ద్వారా ఈ బినామీ కంపెనీలను తన గుప్పిట్లో ఉంచుకున్నారు. శరత్ ఆదేశాల మేరకు పైన పేర్కొన్న మూడు కంపెనీలకు చెందిన కార్యకలాపాలను తాము చూస్తున్నట్లు ఆయన కింద పనిచేసే ఉద్యోగులు చెప్పారు. తయారీదారులు, టోకు, చిల్లర వ్యాపారులతో కలిపి సౌత్గ్రూప్ పేరుతో ఏర్పాటైన అతిపెద్ద సిండికేట్లో శరత్ చంద్రారెడ్డి ప్రధాన భాగస్వామి. ఈ సిండికేట్లో మద్యం తయారీదారు సమీర్ మహేంద్రుతో పాటు, దేశంలో అతిపెద్ద మద్యం తయారీ సంస్థ అయిన పెర్నాడ్ రికార్డ్ (పీఆర్ఐ) భాగస్వాములుగా ఉన్నాయి. ఇండో స్పిరిట్స్ అనే సంస్థను పీఆర్ఐ సంస్థ తన హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్గా నియమించింది. అయితే ఇండోస్పిరిట్స్ సంస్థ సమీర్ మహేంద్రు, అరుణ్పిళ్లై, ప్రేమ్ రాహుల్ మండూరిల చేతుల్లో ఉంది. ఇందులో శరత్ చంద్రారెడ్డితో పాటు, ఇతర బినామీలకు ఆర్థిక ప్రయోజనాలున్నాయి. ఇండో స్పిరిట్స్లో శరత్ చంద్రారెడ్డి కూడా పెట్టుబడులు పెట్టినట్లు వెలుగులోకి వచ్చింది.
* శరత్ చంద్రారెడ్డి నడుపుతున్న సౌత్గ్రూప్ పలు బినామీ సంస్థల ద్వారా తొమ్మిది రిటైల్ జోన్లను తన అధీనంలో ఉంచుకుంది. తన మూడు కంపెనీల ద్వారా 5 రిటైల్ జోన్లను, సిండికేట్లో సభ్యులుగా ఉన్న ఇతరుల ద్వారా మరో 4 జోన్లను శరత్ నడుపుతున్నారు. ముడుపులు ముట్టచెప్పడం, బినామీ సంస్థలు నడపడం, మద్యం పరిశ్రమలోని వివిధ భాగస్వాములతో కుట్ర పన్నడం లాంటి అవినీతి కార్యకలాపాలతో ఈ సిండికేట్ దిల్లీ మద్యం మార్కెట్లో 30 శాతాన్ని నియంత్రిస్తోంది.
* శరత్ చంద్రారెడ్డి, ఇతరుల ఆధ్వరంలో నడుస్తున్న సౌత్గ్రూప్ సిండికేట్ విజయ్నాయర్ ద్వారా రూ.100 కోట్ల ముడుపులు ముట్టజెప్పింది. ఇలా చేసిన చెల్లింపులను పలు రిటైల్ జోన్లు, ఇండోస్పిరిట్స్ ద్వారా ముందుగా రాబట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దర్యాప్తు పురోగతిలో ఉంది.
* శరత్ చంద్రారెడ్డికి చెందిన రిటైల్జోన్లలో ఉన్న సర్వర్లను ఉద్యోగులు వేరే చోటికి తరలించేందుకు ప్రయత్నించినట్లు సోదాలు నిర్వహించినప్పుడు తెలిసింది. ఆ సర్వర్లను విశ్లేషించినప్పుడు అవంతిక, ట్రైడెంట్ సంస్థలకు చెందిన రెండు రిటైల్ జోన్లకు సంబంధించిన సమాచారం అందులో ఉన్నట్లు తేలింది. శరత్ నిర్దేశాల మేరకు కీలకమైన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను తమ కార్యాలయ ప్రాంతాల నుంచి తొలగించినట్లు ఒక ఉద్యోగి చెప్పారు. సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఈ పనిచేశారు. ట్రైడెంట్ మినహా మిగిలిన సంస్థల పేరుతో తనకు ఎలాంటి రిటైల్ జోన్లు లేవని శరత్ చంద్రారెడ్డి చెప్పినప్పటికీ అవంతిక, ట్రైడెంట్ సంస్థలకు చెందిన సర్వర్లను తరలించమని ఆయన ఆదేశాలు జారీచేశారు. ఆ సర్వర్లను విశ్లేషించినప్పుడు నేరనిరూపణకు అవసరమైన సమాచారం అందులో ఉన్నట్లు తేలింది.
* ఇండో స్పిరిట్స్ సంస్థ సొంతంగా శరత్ చంద్రారెడ్డి సంస్థలకు అధిక క్రెడిట్ నోట్లు జారీ చేసింది. తయారీదారులేమీ ఆ క్రెడిట్నోట్స్ను ట్రైడెంట్, అవంతిక, ఆగ్రానోమిక్స్కి జారీ చేయమని కోరుతూ ఇండోస్పిరిట్కి ఇవ్వలేదు. తయారీదారులు ఇవ్వకపోయినా క్రెడిట్నోట్స్ జారీ చేయడం మోసపూరితం. రూ.4.35 కోట్ల విలువైన క్రెడిట్నోట్స్ను ఇండో స్పిరిట్ ఈ మూడు సంస్థలకు జారీ చేయడానికి ప్రధాన కారణం శరత్ చంద్రారెడ్డి చేతుల్లో ఉన్న రిటైల్జోన్లకు అనుచిత లాభాలు/ప్రయోజనాలు బదిలీ చేయడమే. టోకు వ్యాపారులకు అదనంగా ఇచ్చిన 7% మార్జిన్ను లంచం రూపంలో ఇలా బదిలీ చేశారు.
* దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికి చాలా క్రెడిట్నోట్స్ను వెనక్కు తీసుకున్నట్లు 2022 ఆగస్టులో కాగితాలమీద చూపారు. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించిన తర్వాత ఆ పనిచేశారు. దీన్నిబట్టి ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన రూ.60 కోట్లు ట్రైడెంట్ కెమ్ఫర్ ప్రైవేట్ లిమిటెడ్, ఆగ్రానోమిక్స్ ఎకో సిస్టమ్స్, శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ ఆధ్వర్యంలోని రిటైల్జోన్లకు సంబంధించిందని స్పష్టంగా తెలుస్తోంది. ఎలాంటి సిండికేట్లు లేకుండా వ్యాపారం చేసే జోన్లతో పోలిస్తే వీటి దగ్గర ఇంత భారీ మొత్తం మిగలడం అన్నది అసాధారణం.
* శరత్ చంద్రారెడ్డికి చెందిన రిటైల్ గ్రూపుల వద్ద ఉన్న మిగులు మొత్తం గురించి ఏమీ అడగొద్దని సమీర్ మహేంద్రు తన ఫైనాన్స్ బృందానికి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీన్నిబట్టి ఈ రూ.60 కోట్లు, ఇంతకుముందు పేర్కొన్న రూ.4.35 కోట్ల క్రెడిట్ నోట్స్ అన్నీ నేరపూరితంగా కూడగట్టుకొన్న సొమ్మే.
* వివిధ వ్యాపారులు, రాజకీయ నాయకులతో కలిసి శరత్ చంద్రారెడ్డి పక్కా ప్రణాళిక, కుట్ర ప్రకారం మోసపూరిత మార్కెట్ విధానాల ద్వారా దిల్లీ మద్యం విధానం నుంచి అనుచిత ప్రయోజనం పొందడానికి ప్రయత్నించినట్లు ఈ అంశాలు స్పష్టం చేస్తున్నాయి. శరత్ చంద్రారెడ్డి కుట్రపూరితంగా సిండికేట్ ద్వారా విస్తృత మార్కెట్ను నడపడం అన్నది కూడా దిల్లీ మద్యం విధానానికి విరుద్ధం. అవినీతిపనులు, కుట్ర ద్వారా ఆయన రూ.64.35 కోట్ల సొమ్మును కూడగట్టారు.
* ఇప్పటివరకు నిర్వహించిన దర్యాప్తు ప్రకారం నేరపూరితంగా సొమ్మును రాబట్టుకొని, దగ్గర ఉంచుకోవడంతోపాటు దాన్ని ఉపయోగించడంలో శరత్ చంద్రారెడ్డి పాలుపంచుకున్నట్లు తేలింది. మనీలాండరింగ్ నేరం కింద ఆయన నిందితుడు. దర్యాప్తునకు అతిముఖ్యమైన సమాచారం ఆయన వద్ద ఉంది. అందుకే పీఎంఎల్ఏ-2002 సెక్షన్ 19 కింద ఆయనను దిల్లీ ఈడీ ఆఫీసులో అరెస్టు చేశాం. వెంటనే ఆ విషయాన్ని ఆయన సతీమణికి ఫోన్ ద్వారా చెప్పాం.
* ఇప్పటివరకు నిర్వహించిన 169 సోదాల ద్వారా భారీగా డిజిటల్, ఫిజికల్ రికార్డులు స్వాధీనం చేసుకున్నాం. ఇప్పుడు అందులోని వివరాల గురించి ఆయనను విచారించాల్సి ఉంది. దిల్లీ ప్రభుత్వానికి జరిగిన రూ.2,631 కోట్ల ఆదాయ నష్టం గురించీ కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉంది. మొత్తం నేరం పూర్వాపరాలను రాబట్టి ఇప్పటివరకు నేరపూరితంగా సంపాదించిన సొమ్మునంతా వెలికి తీయాల్సి ఉంది’ అని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.
140 ఫోన్లు ధ్వంసం చేశారు
దిల్లీ మద్యం కుంభకోణంలో కీలకంగా ఉన్న 34 మంది వ్యక్తులు సాక్ష్యాలను చెరిపేయడానికి ఇప్పటివరకు రూ.1.20 కోట్ల విలువైన 140 ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఇందులో ప్రధాన నిందితులు, పెద్ద మద్యం వ్యాపారులు, సీనియర్ ప్రభుత్వాధికారులు, దిల్లీ ఎక్సైజ్ మంత్రి, ఇతర అనుమానితులు ఉన్నట్లు తెలిపింది. ఫోన్లు మార్చిన విషయాన్ని గమనిస్తే ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే ఆ పని చేసినట్లు స్పష్టమవుతోందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
రోడ్డుపైనే సీపీఆర్.. వందనమమ్మా డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
తరగతి గది ఆవరణలో చిన్నారి మృతదేహం.. స్కూల్కు నిప్పంటించిన కుటుంబసభ్యులు
-
ఆ నిర్ణయం నాకు ముందే చెప్పాడు: కోహ్లీ
-
హింసపై ఈసీకి సీఈవో నివేదిక.. కీలక నేతల అరెస్టులకు అవకాశం?
-
రివ్యూ: విద్య వాసుల అహం.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే?
-
పాక్ వద్ద అణ్వస్త్రాలున్నా.. నిర్వహణకు డబ్బుల్లేవు కదా! - మోదీ
-
ధోనీ నుంచి అసలైన షో చూడబోతున్నాం: భారత మాజీ క్రికెటర్