110 మంది టీచర్లకు డీఈవో షోకాజ్‌ నోటీసులు

పదో తరగతి వాల్యుయేషన్‌కు హాజరుకాని ఉపాధ్యాయులకు ఆదిలాబాద్‌ డీఈవో షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

Published : 06 Apr 2024 00:10 IST

ఆదిలాబాద్‌: పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం నేపథ్యంలో ఆదిలాబాద్‌ జిల్లాలో 110 మంది టీచర్లకు విద్యాశాఖ ఉన్నతాధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. పదో తరగతి వాల్యుయేషన్‌కు హాజరుకాని వారికి ఈ నోటీసులు ఇచ్చారు. శనివారం లోపు హాజరు కాకుంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని డీఈవో ప్రణీత హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని