Health News: నిద్ర పట్టడం లేదా? మంచి నిద్రకు మార్గాలివే!
ఒక రోజు నిద్ర పోకపోతే తల్లడిల్లి పోతాం. కంటికి విశ్రాంతి లేకుండా పోయిందని బాధపడుతాం.
ఇంటర్నెట్డెస్క్: ఒక రోజు నిద్ర పోకపోతే తల్లడిల్లి పోతాం. కంటికి విశ్రాంతి లేకుండా పోయిందని బాధపడతాం.. నీరసం, నిస్సత్తువ ఆవహిస్తాయి. ఎలాగైనా మంచి నిద్ర పోవాలని ఆరాట పడతాం. కొంతమంది ఏకంగా నిద్ర మాత్రలను కూడా ఆశ్రయిస్తారు. చక్కని సుఖనిద్రకు ఏం చేయాలో తెలుసుకుందాం.
చక్కని నిద్రకు ఏం చేయాలి: నిద్ర సంపూర్ణంగా పోతే శరీరం శక్తి కూడ గట్టుకుంటుంది. కొత్త ఉత్సాహం వస్తుంది. కంటి నిండా కమ్మటి నిద్రకు ఏం చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి
* రోజూ ఒకే సమయానికి నిద్రకు ఉపక్రమించాలి. శరీరంలోని నిద్ర, మెలకువ చక్రం సర్దుకొని రాత్రిపూట బాగా నిద్ర పట్టేలా చేస్తుంది.
* కడుపునిండా తిని, ఆకలిగా ఉన్నప్పుడు నిద్రించకూడదు.
* ద్రవాలను ఎక్కువగా తీసుకుంటే మధ్యలో లేవాల్సి రావొచ్చు.
* నిద్ర పోవడానికి ముందు సిగరెట్లు, కాఫీల జోలికి వెళ్లొద్దు.
* రోజూ పడక మీదకు చేరక ముందు స్నానం చేయడం, పుస్తకం చదవడం, సంగీతం వింటే శరీరం నిద్రకు సన్నద్ధం అవుతుంది.
* టీవీ, కంప్యూటర్లు, సెల్ఫోన్ వంటి వాటికి దూరంగా ఉండాలి.
* పడక గది చల్లగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. మంచం, పరువు సౌకర్యంగా ఉండాలి.
* పగటి పూట నిద్ర పోవద్దు. ఎక్కువ సేపు నిద్ర పోతే రాత్రిపూట నిద్ర పట్టదు. మధ్యాహ్నం అరగంటకు మించి నిద్రపోకుండా చూసుకోవాలి.
* రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది గాఢనిద్రకు దారి తీస్తుంది. కాసేపట్లో నిద్ర పోతామనగా వ్యాయామం చేయకూడదు.
* ఒత్తిడికి దూరంగా ఉండాలి. పని, మానసిక ఒత్తిడి నిద్రను దూరం చేస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?