ఆటో డ్రైవర్కు 38ఎకరాలు..
అమలాపురానికి చెందిన వాసంశెట్టి వెంకటరమణ, వెంకటలక్ష్మి పాతికేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. పొట్ట చేత పట్టుకుని వేపగుంటకు వచ్చేశారు. అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వీరికి కుమార్తె నవ్యశ్రీ, కుమారుడు మణికంఠ ఉన్నారు. కుమార్తె డిగ్రీ, కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు.
వేపగుంట రామాలయం వీధిలో అద్దె ఇంటి వద్ద అమ్మఒడి అనర్హత పత్రాలు చూపుతున్న వెంకటలక్ష్మి
వేపగుంట, పెదవాల్తేరు: అమలాపురానికి చెందిన వాసంశెట్టి వెంకటరమణ, వెంకటలక్ష్మి పాతికేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. పొట్ట చేత పట్టుకుని వేపగుంటకు వచ్చేశారు. అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వీరికి కుమార్తె నవ్యశ్రీ, కుమారుడు మణికంఠ ఉన్నారు. కుమార్తె డిగ్రీ, కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు. వెంకటరమణ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, గృహనిర్మాణ పథకాలకు వాలంటీరు ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అర్హుల జాబితా పరిశీలనలో విస్తుపోయే వివరాలు కనిపించాయి. ఆ కుటుంబానికి మెట్ట 37.7 ఎకరాలు, మగాణి 0.49 ఎకరాలు ఉన్నట్టు నమోదై ఉంది.
● ఆరోగ్యశ్రీ, గృహ నిర్మాణాల విషయంలో పరిశీలిస్తే.. 5 ఎకరాల పొలం ఉన్నట్టు కనిపించింది. దీంతో ఆ కుటుంబం విద్యాశాఖ, రెవెన్యూ, ఆరోగ్యశాఖ అధికారుల చుట్టూ నాలుగు రోజులుగా తిరుగుతున్నా స్పందించలేదు. చివరకు వీఆర్వో నిర్మల వెళ్లి తమకు భూమి లేదని ధ్రువీకరణ పత్రం రాసి ఇచ్చారు. ఆ పత్రాన్ని పట్టుకుని కుమారుడు చదువుతున్న పాఠశాలకు వెళ్లి అందజేశారు. ఉపాధ్యాయులు తహసీల్దారు ధ్రువీకరణ పత్రం ఉండాలని చెప్పారు. తీసుకురాలేదని చెప్పడంతో వీఆర్వో ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్నారు. అధికారులు తమకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి అర్హులు చేయాలని ఆ కుటుంబం వేడుకుంటోంది.
అంతేకాదు.. రేషన్కార్డు సమస్యతో అమ్మఒడికి దూరమైన లబ్ధిదారులంతా శనివారం కలెక్టరేట్లో పౌరసరఫరాల శాఖ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. రేషన్కార్డులు లేకపోవడం వల్ల పథకానికి దూరమవుతున్నామని, కొత్తరేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండు చేశారు. కొత్తవి ఇవ్వడానికి ఇపుడు సాధ్యం కాదని అధికారులు చెప్పగా జేసీ శివశంకర్ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పథకానికి అర్హులైన వారికి పత్రాలు జారీ చేసి ఇవ్వమని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..