దుర్గమ్మ సన్నిధిలో.. ఏమి జరుగుతోంది
దుర్గమ్మను దర్శించుకునేందుకు రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. వారిలో ఎక్కువ మంది అమ్మ వారికి చీరలను మొక్కుల రూపంలో అందజేస్తారు. వాటిని వారు అక్కడే కొనుగోలు చేస్తారు. అయితే వ్యాపారులు ముక్కల
ముక్కల చీరలతో భక్తులకు టోకరా..!
దుర్గమ్మను దర్శించుకునేందుకు రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. వారిలో ఎక్కువ మంది అమ్మ వారికి చీరలను మొక్కుల రూపంలో అందజేస్తారు. వాటిని వారు అక్కడే కొనుగోలు చేస్తారు. అయితే వ్యాపారులు ముక్కల చీరలను లోపలి పెట్టి అందంగా ప్యాక్ చేసి భక్తులకు టోకరా వేసి సొమ్ము చేసుకుంటున్నారు. మళ్లీ దేవాలయ సిబ్బంది కొందరు ఆ చీరలనే తిరిగి వ్యాపారులకు చేర్చుతూ (రీసైక్లింగ్) వారూ జేబులు నింపుకుంటున్నారు. దీనిపై ప్రత్యేక కథనం.
ఇంద్రకీలాద్రి, న్యూస్టుడే
ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను రాష్ట్రం నలుమూలల నుంచి నిత్యం 40 వేల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. శుక్రవారం, ఆదివారం వారి సంఖ్య 60వేలు ఉంటుంది. వారిలో పేద, మధ్య తరగతి వర్గాలు అమ్మవారికి చీర మొక్కు చెల్లించుకునేందుకు దుర్గాఘాట్లోని హాకర్లను, మల్లికార్జున మహామండపంలోని ఐదో అంతస్తులోని దుకాణాలను ఆశ్రయిస్తారు.
అందంగా మాయ చేస్తూ : హాకర్లు,వ్యాపారులు అందమైన ప్యాకింగ్లో మూడు గజాల చీరకు బదులు గజం చీర ముక్కను మధ్యలో పేపర్లు పెట్టి అచ్చమైన చీరలా ప్యాకింగ్ చేసి భక్తులకు విక్రయిస్తారు.
ధరలోనూ ధగా: రూ.30ల విలువ కూడా చేయని ఆ చీర ముక్కను భక్తులకు రూ.100ల నుంచి రూ.150లకు విక్రయించి సొమ్ము చేసుకుంటారు.
రీసైక్లింగ్ చేస్తూ: భక్తులు ఇచ్చిన చీరలను దేవాలయంలో ఉంచుతారు.వాటిని దేవస్థానం సిబ్బంది కొందరు వ్యాపారులు, హాకర్ల వద్దకు చేర్చుతున్నారు. వారు తిరిగి వాటిని భక్తులకు అమ్ముతున్నారు. ఇది నిత్యం కొనసాగుతూనే ఉన్నా దానిపై అధికారులు ఏలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగిపోతోంది.
పట్టించుకోక ఇలా: గతంలో ఆచీరలను గుండగుత్తగా రూ.22 లక్షలకు గుత్తేదారు పాటపాడుకున్నారు. గత ఏడాది గుత్తేదారు దేవస్థానం అధికారులు పెట్టిన నిబంధనల ప్రకారం ముక్కల చీరను రూ.22.50 చొప్పున విక్రయించేందుకు ధరను నిర్ణయించారు. అందు కోసం రూ.50వేలు డిపాజిట్ను కూడా కట్టించారు.
గుత్తేదారునికి: భక్తులు సమర్పించిన ముక్కల చీరలను గోదాములో ఉండే కొందరు సిబ్బంది వ్యాపారులకు దొడ్డి దారిన తక్కువ రేటుకు విక్రయిస్తుండటంతో గుత్తేదారు దగ్గర వాటిని కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీనితో గుత్తేదారు వాటిని ఆలయంలోనే ఉంచారు. ఇది సిబ్బందికి వరంలా మారింది. దీని వలన దేవస్థానం ఆదాయానికి భారీగానే గండిపడుతోంది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా