పరీక్ష ఫలితాలకు ‘ఓయూ’ ప్రత్యేక యాప్
ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసే పరీక్షల ఫలితాలు ఇక నుంచి యాప్లో చూసుకునే వెసులుబాటును ఓయూ కల్పించనుంది. ‘ఓయూ స్టూడెంట్’ అనే యాప్ సాయంతో ఫలితాలు తెలుసుకోవచ్చు.
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసే పరీక్షల ఫలితాలు ఇక నుంచి యాప్లో చూసుకునే వెసులుబాటును ఓయూ కల్పించనుంది. ‘ఓయూ స్టూడెంట్’ అనే యాప్ సాయంతో ఫలితాలు తెలుసుకోవచ్చు. యాప్ ద్వారా ఫలితాలు తెలుసుకునే సౌకర్యాన్ని శుక్రవారం విడుదల చేసిన డిగ్రీ సెమిస్టర్ ఫలితాల ద్వారా ఓయూ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఉస్మానియా వర్సిటీ పరిధిలో ప్రతి సెమిస్టర్లో సుమారు 80 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుంటారు. పరీక్షల ఫలితాలను విశ్వవిద్యాలయం నేరుగా ఉస్మానియా వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతుంది. అనంతరం అరగంట తర్వాత ఇతర వెబ్సైట్లలోనూ అందుబాటులోకి తీసుకొస్తుంది. ఫలితాలు వెలువడిన సమయంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఒకేసారి ఉస్మానియా వెబ్సైట్లోకి వెళ్లి చూస్తుండటంతో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వర్సిటీకి సాంకేతిక సాయం అందిస్తున్న సైబర్ హైట్స్ అనే సంస్థ ‘ఓయూ స్టూడెంట్’ మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థులు వారి హాల్టికెట్, మొబైల్ నంబరుతో యాప్లో రిజిస్టర్ చేసుకుని ఫలితాలు అరచేతిలో చూసుకోవచ్చు. అలాగే మార్కుల మెమోలు కూడా సేవ్ చేసుకునే సౌలభ్యం కల్పించారు. గూగుల్ ప్లే స్టోర్లో ఈ యాప్ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు, ఓయూ అనుబంధ కళాశాలలకు ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతోనే యాప్లోనూ ఫలితాలు విడుదల చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రొ.శ్రీరాం వెంకటేశ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్