నియంత్రణ చర్యల్లో తెలంగాణ భేష్‌‌:హర్షవర్ధన్‌

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర వైద్యఆరోగ్యశాఖ హర్షవర్ధన్‌ అభినందించారు. కరోనా వైరస్‌పై సమీక్షలో భాగంగా అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌...

Updated : 06 Mar 2020 22:00 IST

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర వైద్యఆరోగ్యశాఖ హర్షవర్ధన్‌ అభినందించారు. కరోనా వైరస్‌పై సమీక్షలో భాగంగా అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమీక్షలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌,  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, యోగితా రాణా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా వైరస్‌ నియంత్రణపై హర్షవర్ధన్‌ పలు సూచనలు చేశారు. పకడ్బందీ ప్రణాళికతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోందని..మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణను అనుసరించాలని కేంద్ర మంత్రి సూచించారు. అనంతరం ఈటల మాట్లాడుతూ తెలంగాణలో ఎన్‌-95 మాస్క్‌లను అందిండంతో పాటు రాష్ట్రంలో మరో కరోనా ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని హర్షవర్ధన్‌ను కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని