క్యాన్సర్ బాధితులకు కురుల దానం
ఇతరులను ఆదుకునేందుకు ఆస్తులు అంతస్తులేమీ అవసరం లేదు.. సాయం చేయాలన్న మంచి మనసుంటే చాలని తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్లోని ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థినులు మరోసారి నిరూపించారు. క్యాన్సర్ బాధితులకు తమ కురులను దానం చేసి...
కోయంబత్తూర్: ఇతరులను ఆదుకునేందుకు ఆస్తులు అంతస్తులేమీ అవసరం లేదు.. సాయం చేయాలన్న మంచి మనసుంటే చాలని తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్లోని ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థినులు మరోసారి నిరూపించారు. క్యాన్సర్ బాధితులకు తమ కురులను దానం చేసి శెభాష్ అనిపించారు. క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న వారికి సహజంగా జుట్టు ఊడిపోతుంది. అలాంటి వారి కోసం విగ్గులు తయారు చేసేందుకు తమ జుట్టు ఉపయోగపడుతుందని సదరు విద్యార్థినులు చెబుతున్నారు. క్యాన్సర్ బాధితులను ఆర్థికంగా సాయం చేసే స్తోమత తమకు లేదని, అందువల్ల తమ జుట్టే వారికి ఎంతో కొంత సాయంగా నిలుస్తుందన్న ఆశతో దానం చేశామని వినోదిని అనే విద్యార్థిని మీడియాకు తెలిపారు.
ఇప్పటి వరకు 80 మంది విద్యార్థినులు తమ శిరోజాలను దానం చేసేందుకు రిజిస్టర్ చేసుకున్నారని, మరో 200 మందికిపైగా కురులను దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని సదరు విద్యార్థిని చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. వాళ్ల ఆలోచనను పలువురు అభినందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్పై దాడి.. పోలీసుల సమక్షంలోనే వైకాపా అరాచకం
అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తారువలో వైకాపా నేతలు దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
సీఎం రేవంత్రెడ్డిని రోహిత్ వేముల తల్లి రాధిక కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఎల్పీయూ సత్తా.. వర్సిటీ విద్యార్థికి ₹3 కోట్ల ప్యాకేజీ (ADVT)
ఉన్నత విద్యలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సటీ (LPU) తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ప్రాంగణ నియామకాల్లో కొత్త రికార్డులను నెలకొల్పుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?