ఒక్క విద్యార్థి.. 8 మంది సిబ్బంది

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో పదో తరగతి పరీక్ష రాయడానికి ఒకే విద్యార్థి హాజరయ్యాడు. పట్టణంలోని న్యూ శాతవాహన ఉన్నత

Published : 19 Mar 2020 14:10 IST

హుజూరాబాద్‌: కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో పదో తరగతి పరీక్ష రాయడానికి ఒకే విద్యార్థి హాజరయ్యాడు. పట్టణంలోని న్యూ శాతవాహన ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తొలిరోజు తెలుగు పరీక్ష రాయడానికి శ్రీకాంత్‌ అనే విద్యార్థికి మాత్రమే ఈ కేంద్రాన్ని కేటాయించారు. ఒక్క విద్యార్థి కోసం ఎనిమిది మంది సిబ్బంది విధులు నిర్వహించారు. పరీక్షా కేంద్రానికి సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంట్‌ అధికారి, ఇన్విజిలేటర్‌, ఆరోగ్య సహాయకుడు, ముగ్గురు పోలీస్‌ సిబ్బంది, అటెండర్‌ వంటి ఉద్యోగులు విధులు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని