నాగర్‌కర్నూలులో ఒకరికి కరోనా పాజిటివ్‌

తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని డీఎంహెచ్‌వో సుధాకర్‌లాల్‌ వెల్లడించారు. దిల్లీ నిజాముద్దీన్‌లో ప్రార్థనలకు జిల్లా నుంచి 11 మంది వెళ్లినట్లు గుర్తించి వారి నమూనాలను పరీక్షలకు..

Published : 31 Mar 2020 15:37 IST

నాగర్‌కర్నూలు: తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని డీఎంహెచ్‌వో సుధాకర్‌లాల్‌ వెల్లడించారు. దిల్లీ నిజాముద్దీన్‌లో ప్రార్థనలకు జిల్లా నుంచి 11 మంది వెళ్లినట్లు గుర్తించి వారి నమూనాలను పరీక్షలకు పంపించామని చెప్పారు. 10 మంది వైద్య పరీక్షల రిపోర్టులు రాగా.. వారిలో తొమ్మిది మందికి నెగటివ్ రాగా‌.. ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. మరొకరి నివేదిక రావాల్సి ఉందని డీఎంహెచ్‌వో సుధాకర్‌ లాల్‌ తెలిపారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని