ఆపత్కాలం.. విరిసిన మానవత్వం..!
లాక్డౌన్ వేళ పేదల ఆకలి బాధలు తీర్చేందుకు సాయం చేసే చేతులు వేలాదిగా ముందుకు వస్తున్నాయి. దాతలు ఎక్కడికక్కడ శిబిరాలు ఏర్పాటు చేసి, ఇంటింటికి వెళ్తూ తోచిన మేర సాయమందిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయనేతలే కాకుండా పలువురు సాధారణ వ్యక్తులు సైతం సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ దాతృత్వం చాటుతున్నారు.
ఇంటర్నెట్డెస్క్: లాక్డౌన్ వేళ పేదల ఆకలి బాధలు తీర్చేందుకు సాయం చేసే చేతులు వేలాదిగా ముందుకు వస్తున్నాయి. దాతలు ఎక్కడికక్కడ శిబిరాలు ఏర్పాటు చేసి, ఇంటింటికి వెళ్తూ తోచిన మేర సాయమందిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నేతలే కాకుండా పలువురు సాధారణ వ్యక్తులు సైతం సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ దాతృత్వం చాటుతున్నారు.
* కృష్ణాజిల్లా మైలవరంలోని సూరిబాబుపేట ప్రభుత్వ పాఠశాలలో ద్వారకా తిరుమల దేవస్థానం అన్నదానం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రారంభించగా.. లాక్డౌన్ ఉన్నంత వరకు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.
* ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యేలా చూస్తూ.. ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ నిరంతరం శ్రమిస్తున్న పోలీసు సిబ్బందికి గుడివాడలో పలు స్వచ్ఛంద సంస్థలు మాస్కులు, మజ్జిగ, భోజనం ప్యాకెట్లు, శానిటైజర్లు పంపిణీ చేశాయి.
* విజయవాడ నగరంలో నిరాశ్రయులైన వారందరినీ మున్సిపల్ అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. సుమారు 500 మందికి మూడు పాఠశాలల్లో వసతి సౌకర్యాలు కల్పించగా.. స్వచ్ఛంద సంస్థలు వారికి భోజనాలు ఏర్పాటు చేశాయి.
* ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి గుంటూరు మిర్చి యార్డులో పనిచేసే కూలీల ఆకలి బాధకు స్థానిక నాయకులు పరిష్కారం చూపారు. 15రోజులకు సరిపడా బియ్యం, కూరగాయలు, పండ్లు అందించి దాతృత్వం చాటుకున్నారు. దాదాపు 1000 కుటుంబాలకు సరకులతో కూడిన కిట్లు పంపిణీ చేశారు.
* తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలంలో మల్లిసాల నుంచి గోకవరం వెళ్లే మార్గంలో సందర్శకులు రాక.. తిండి లేక.. అలమటిస్తున్న కోతులకు దాతలు బియ్యం, అరటి పండ్లు, శనగపప్పు వేసి ఆకలి తీర్చారు.
ఇలా రాష్ట్ర్ర వ్యాప్తంగా వేరు వేరు ప్రాంతాల్లో దాతలు, పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పేదల ఆకలి తీరుస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక