శ్రామిక్ రైలులో వలసకూలీల అదృశ్యం
సూరత్ నుంచి హరిద్వార్కు వలసకార్మికులతో వస్తున్న శ్రామిక్రైలులోని కొందరు అదృశ్యమైన ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే వలసకార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు రైల్వేశాఖ ఏర్పాటు చేసిన శ్రామిక్రైలు మే 12న 1340 మందితో
హరిద్వార్: సూరత్ నుంచి హరిద్వార్కు వలసకార్మికులతో వస్తున్న శ్రామిక్రైలులోని కొందరు అదృశ్యమైన ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే వలసకార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు రైల్వేశాఖ ఏర్పాటు చేసిన శ్రామిక్రైలు మే 12న 1340 మందితో సూరత్ నుంచి హరిద్వార్కు బయలుదేరింది. అయితే గమ్యస్థానం చేరేటప్పటికి సుమారు 167 మంది వలసకార్మికులు అదృశ్యమైనట్టు అధికారులు గుర్తించారు. హరిద్వార్స్టేషన్లో 1173 మంది కార్మికులే రైలు దిగినట్టు హరిద్వార్ కలెక్టర్ సి.రవిశంకర్ పేర్కొన్నారు. సూరత్లో వలసకార్మికులు రైలు ఎక్కిన తర్వాత ఎక్కడా ఆపకుండా రైలు ప్రయాణించిందని పేర్కొన్న అధికారులు ఈ ఘటన ఎలా జరిగింది అన్నదానిపై విచారణ చేస్తున్నారు. ఇలా జరగడాన్ని తీవ్రంగా పరిగణిస్తునట్టు పేర్కొన్న కలెక్టర్ రవిశంకర్ విచారణ పూర్తయిన తర్వాత బాధ్యులపై కఠినచర్యలు ఉంటాయని తెలిపారు. వలసకార్మికులను శ్రామిక్రైలులో తరలించడానికి అధికారులు అవసరమైన జాగ్రత్తచర్యలు తీసుకుంటున్నారు. రైలు ఎక్కేముందు వారికి కొవిడ్-19 పరీక్షలు చేసి పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. గమ్యస్థానం చేరాక కూడా పరీక్షలు చేస్తున్నారు. ఇపుడు ఈ ఘటన జరగడంతో అక్కడి అధికారులు తలలు పట్టుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువత ఓటింగ్లో పాల్గొనేలా చేద్దాం: సంజయ్ ఉపాధ్యాయ
విద్యా వంతులు, యువత ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (WJI) జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్పై దాడి.. పోలీసుల సమక్షంలోనే వైకాపా అరాచకం
అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తారువలో వైకాపా నేతలు దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
సీఎం రేవంత్రెడ్డిని రోహిత్ వేముల తల్లి రాధిక కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఎల్పీయూ సత్తా.. వర్సిటీ విద్యార్థికి ₹3 కోట్ల ప్యాకేజీ (ADVT)
ఉన్నత విద్యలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సటీ (LPU) తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ప్రాంగణ నియామకాల్లో కొత్త రికార్డులను నెలకొల్పుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
రష్యా వాంటెడ్ లిస్ట్లో జెలెన్స్కీ..!
-
దంచికొట్టిన డుప్లెసిస్, కోహ్లీ.. గుజరాత్పై బెంగళూరు విజయం
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM