తీరాన్ని తాకిన అతి తీవ్ర తుపాను అంపన్
అతి తీవ్ర తుపాను అంపన్ పశ్చిమబెంగాల్లో తీరాన్ని తాకింది. భీకరగాలులతో ఇది దిఘా, హతియా దీవుల వద్ద తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సుమారు 4 గంటల పాటు తీరం దాటే ప్రక్రియ కొనసాగనున్నట్లు తెలిపారు. ఈ
కోల్కతా: అతి తీవ్ర తుపాను అంపన్ పశ్చిమబెంగాల్లో తీరాన్ని తాకింది. భీకరగాలులతో ఇది మధ్యాహ్నం 2.30 గంటలకు తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సుమారు 4 గంటల పాటు తీరం దాటే ప్రక్రియ కొనసాగనున్నట్లు తెలిపారు. బంగాల్-బంగ్లాదేశ్ మధ్య సుందర్బన్ వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాల్లోని దాదాపు 4.5 లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఈ తుపాను కారణంగా ఇప్పటికే ఒడిశా, బంగాల్ తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఆయా ప్రాంతాల్లో ఈదురుగాలుతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. తుపాను నేపథ్యంలో సముద్రంలో ఎగిసిపడుతున్న రాకాసి అలలు పశ్చిమ బంగాలోని తీర ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృంత్యుజయ మొహపాత్రా తెలిపారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గంటకు 170-200 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుపాను తీరం దాటాక గంటకు 110-120 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇది బంగ్లాదేశ్ వైపు వెళ్లాక తీవ్ర వాయుగుండగా మారనుంది. ఆ తర్వాత బలహీన పడనున్నట్లు అధికారులు తెలిపారు.
శాటిలైట్ పోన్లతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు..
అతి తీవ్ర తుపాను అంపన్ బీభత్సం సృష్టిస్తుండటంతో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసినట్లు ఎన్టీఆర్ఎఫ్ డీజీ ఎస్.ఎన్. ప్రధాన్ తెలిపారు. ఒడిశా, బంగాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. బంగాల్లో 19 ఒడిశాలో 20 బృందాలను మోహరించినట్లు వెల్లడించారు. తుపాను కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉండటంతో శాటిలైట్ ఫోన్లతో ఈ బృందాలు అనుసంధానమవుతాయని తెలిపారు.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..