పీఎంజీకేపీ ద్వారా 42 కోట్ల మందికి లబ్ధి
కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన 42 కోట్ల మంది పేదవారికి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజి కింద....
దిల్లీ: కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన 42 కోట్ల మంది పేద వారికి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ (పీఎంజీకేపీ) కింద రూ.53,248 కోట్ల నగదు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా సంక్షోభం కారణంగా ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకునేందుకు మార్చి 26న కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ద్వారా ఉచితంగా ఆహార ధాన్యాలు, మహిళలు, వృద్ధులు, రైతులకు నగదు చెల్లింపులు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ప్యాకేజీ అమలు తీరును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం పర్యవేక్షించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.
‘‘సుమారు రూ.42 కోట్ల మంది లబ్ధిదారులు పీఎంజీకేపీ కింద రూ.53,248 కోట్ల ఆర్థిక సహాయాన్ని పొందారు. మొదటి దశలో పీఎం-కిసాన్ ద్వారా 8.19 కోట్ల మంది లబ్ధి దారులకు రూ.16,392 కోట్లు చెల్లించాం. మహిళల జన్ధన్ ఖాతాల్లోకి రెండు విడతలుగా రూ.20,334 కోట్ల నగదు బదిలీ చేశాం. అలానే 2.81 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు రెండు విడతలుగా రూ.2,814.5 కోట్ల నగదును పంపిణీ చేశాం. పీఎంజీకేపీ కింద 2.3 కోట్ల మంది భవన నిర్మాణ రంగ కార్మికులకు రూ.4,312.82 కోట్ల ఆర్థిక సాయం చేశాం’’ అని ఆర్థిక శాఖ వెల్లడించింది.
ఏప్రిల్ నెలలో 36 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు 101 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు సరఫరా చేయగా, వాటిని దశల వారీగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో లబ్ధిదారులకు అందజేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయువై) ద్వారా 9.25 కోట్ల ఎల్పీజీ సిలిండర్లు బుక్ అవ్వగా ఇప్పటి వరకు 8.58 కోట్ల సిలిండర్లు డెలివరీ చేసినట్లు వెల్లడించింది. అలానే ఈపీఎఫ్ఓ ఖాతాల ద్వారా 16.1 లక్షల మందికి రూ.4,275 కోట్ల నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ అందజేసినట్లు తెలిపారు. 24 శాతం ఈపీఎఫ్ చందాను 59.23 లక్షల మంది ఉద్యోగుల ఖాతాలకు బదిలీ చేసినట్లు ఆర్థికశాఖ ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..