తెలంగాణలో కరోనా@ ఈ రోజు 1080కి పైనే..

తెలంగాణలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం కొనసాగుతోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో.....

Updated : 27 Jun 2020 22:52 IST

రాష్ట్ర వ్యాప్తంగా 13వేలు దాటాయ్‌..

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం కొనసాగుతోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కేసులు నమోదువుతున్నాయి. ఈ రోజు మరో 1087 కేసులు నమోదు కావడం తీవ్ర కలవరపెడుతోంది. శనివారం మొత్తం 3,923 శాంపిల్స్‌ను పరీక్షించగా.. వాటిలో 1087 పాజిటివ్‌గా తేలగా.. 2836 నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 13,436కి పెరిగింది. 

మరో ఆరు మరణాలు

రాష్ట్రంలో కొవిడ్‌ బారిన పడి మరో ఆరుగురు మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 243కి పెరిగింది. రాష్ట్రంలో ఈ రోజు మరో 162 మంది కోలుకోవడంతో ఇప్పటిదాకా డిశ్చార్జిఅయిన వారి సంఖ్య 4928కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8265 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

హైదరాబాద్‌లో 888 కేసులు
మరోవైపు, ఈ రోజు వచ్చిన మొత్తం కేసుల్లో 888 పాజిటివ్‌ కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదుకావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 74, మేడ్చల్‌లో 37, నల్గొండలో 35 చొప్పున అత్యధిక కేసులు ఈ రోజకు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నమోదైన కేసులను పరిశీలిస్తే.. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని