ఇది ఏటీఎం కాదు.. పానీపూరీ మెషిన్
కరోనా వైరస్ దెబ్బతో పానీపూరీ ఇష్టపడే వారి నోటికి తాళం పడింది. లాక్డౌన్ కారణంగా కొన్ని నెలలుగా దాన్ని టేస్ట్ చేసే అవకాశమే
భారత్లో నూతన ఆవిష్కరణ: వైరల్ వీడియో
ఇంటర్నెట్డెస్క్: కరోనా వైరస్ దెబ్బతో పానీపూరీ ఇష్టపడే వారి నోటికి తాళం పడింది. లాక్డౌన్ కారణంగా కొన్ని నెలలుగా దాన్ని రుచి చూసే అవకాశమే లేకపోతోంది. మన దేశంలో ఎక్కడికెళ్లినా పానీపూరీ బండ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. వాటిని తినడానికి కూడా జనమెంతో ఇష్టపడతారు. లాక్డౌన్ కారణంగా మూడు నెలలుగా ఇళ్లకే పరిమితమైన ఆ చిరు వ్యాపారులు సడలింపులతో ఇప్పుడిప్పుడే మళ్లీ రోడ్ల మీదకు వస్తున్నారు. అయితే, ఇప్పుడు వాటిని తినడానికి మాత్రం ప్రజలెవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే కరోనా వైరస్ ప్రభావంతో ఎవరికి వారు తమ ఇంట్లోనే స్వయంగా వండుకొని తింటున్నారు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పానీపూరీ ప్రియుల మనసు అర్థం చేసుకున్న ఓ వ్యక్తి వినూత్న ప్రయత్నం చేశాడు. అచ్చం ఏటీఎం మెషిన్ను తలపించేలా ఓ పానీపూరీ యంత్రాన్ని రూపొందించి ఔరా అనిపించాడు. ఇది నమ్మశక్యం కాకపోయినా ఓ పోలీస్ అధికారే దీన్నీ స్వయంగా వెల్లడించారు. ఎవరూ ముట్టుకోకుండా, డబ్బులు చెల్లించిన వారు మాత్రమే సంతోషంగా పానీపూరీ తినొచ్చు. ఏటీఎంను ఎలా ఉపయోగించుకుంటామో అలాగే దాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. అసోంకు చెందిన అదనపు డీజీపీ హర్దిసింగ్ ఈ వీడియోను ట్విటర్లో పోస్టు చేశారు. ఇది భారత్లో ఆవిష్కరించిన నూతన పరికరం అని, ఆటోమేటిక్గా పానీపూరీ అందిస్తుందని వెల్లడించారు.
ఈ మెషిన్ను రూపొందించడానికి ఆరు నెలల సమయం పట్టిందని దాని సృష్టికర్త వీడియోలో పేర్కొన్నాడు. అలాగే అదెలా పనిచేస్తుందో వివరించాడు. ఏటిఎం మెషిన్లానే దీన్ని ఆపరేట్ చేయాలని, అలాగే ఎవరికి ఇష్టమైన టేస్ట్ను వారు ఎంచుకునే వెసులుబాటు కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. కస్టమర్లు డబ్బులు చెల్లించగానే ఒక్కొక్కటిగా పానీపూరీ బయటకు వస్తుందని, ఒకటి తిన్న తర్వాత మరొకటి బయటకు వస్తుందని చెప్పారు. డబ్బులు చెల్లించిన వారు తప్ప ఇతరులు వాటిని ముట్టుకోలేరని స్పష్టం చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎలాంటి భయం లేకుండా పానీపూరీలు తినొచ్చని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఎక్స్ట్రా పానీపూరీ తినే అవకాశం లేదంటూ జోక్లేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..