పద్మనాభుడి ఆలయ నిర్వహణ ట్రావెన్‌కోర్‌కే

తిరువనంతపురంలోని అనంతపద్మనాభస్వామి ఆలయ మేనేజ్‌మెంట్‌ వివాదంలో ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు

Updated : 13 Jul 2020 12:30 IST

తీర్పు వెల్లడించిన సుప్రీం

దిల్లీ: కేర‌ళలోని ప్ర‌ముఖ అనంత ప‌ద్మ‌నాభ‌స్వామి ఆలయ నిర్వ‌హ‌ణ వివాదం ఓ కొలిక్కి వ‌చ్చింది. ఈ ఆల‌య నిర్వ‌హ‌ణ బాధ్య‌త ట్రావెన్‌కోర్ రాజ‌కుటుంబానికే ఉండ‌టాన్ని భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానం స‌మ‌ర్థించింది. ఆల‌య నిర్వ‌హ‌ణ‌పై రాజ‌కుటుంబానికి ఉన్న హ‌క్కుల‌ను స‌మ‌ర్థిస్తూనే.. త‌దుప‌రి నిర్వ‌హ‌ణ బాధ్య‌త కూడా వారికే అప్ప‌గిస్తూ నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. దీనిపై ఇప్ప‌టికే త్రివేండ్రం జిల్లా న్యాయ‌మూర్తి ఆధ్వ‌ర్యంలో ఓ క‌మిటీని నియ‌మించి ఆల‌య వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షిస్తోంది. కొత్త‌  క‌మిటీ ఏర్పాట‌య్యే వ‌రకూ ప్ర‌స్తుత క‌మిటీ కొన‌సాగుతుంద‌ని సుప్రీం స్ప‌ష్టం చేసింది.

అనంత ప‌ద్మ‌నాభ‌స్వామి దేవాల‌యం నేల‌మాళిగ‌ల్లో భారీ నిధి నిక్షేపాలు ఉన్నాయ‌న్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టివ‌రకు ట్రావెన్‌కోర్ రాజ‌కుటుంబ‌మే ఈ నిధుల‌ను కాపాడుకుంటూ వ‌స్తోంది. అయితే, ‌కొంతకాలం క్రితం వీటి నిర్వ‌హ‌ణ‌పై అనుమానాలు వ్య‌క్తమయ్యాయి. ప్ర‌భుత్వం ఆధీనంలోకి తీసుకోవాల‌ని సుప్రీంలో ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లైంది. దీంతో ట్రావెన్‌కోర్ కుటుంబ‌స‌భ్యులు సుప్రీంను ఆశ్ర‌యించారు. తాజాగా సుప్రీం కోర్టు ఆల‌య నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు రాజ‌కుటుంబానికే ఉండ‌టాన్ని స‌మ‌ర్థించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని