Andhra News: జగన్‌ సభాస్థలి వద్ద అపశ్రుతి.. వృద్ధురాలికి తీవ్రగాయాలు

ఏపీ సీఎం జగన్‌ సభాస్థలి వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. సభ కోసం వచ్చి బస్సు దిగే క్రమంలో ఓ వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి.

Updated : 03 Jan 2023 14:00 IST

రాజమహేంద్రవరం: ఏపీ సీఎం జగన్‌ సభాస్థలి వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. సభ కోసం వచ్చి బస్సు దిగే క్రమంలో ఓ వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పింఛన్ల పెంపు వారోత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరంలో సీఎం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు అర్జి పార్వతి (70) అనే వృద్ధురాలు వచ్చారు. సభాస్థలి వద్ద దిగుతుండగా బస్సు కదలడంతో ఆమె కిందపడిపోయారు. అదే సమయంలో పక్కనుంచి వెళ్తున్న మరో వాహనం వృద్ధురాలి కాళ్ల పైనుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో పార్వతి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను కాకినాడ జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని