వసూల్ రాజాలు.. ఎన్నికలొచ్చాయని వెనక్కి తగ్గారు!
ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టల్లా తలూపుతూ గత ఐదేళ్లుగా అడ్డగోలుగా అనుమతులిచ్చి వారి ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా పని చేసిన పురపాలక, పట్టణాభివృద్ధిశాఖలోని ఒక అత్యున్నతాధికారి... ఎన్నికల కోడ్ అమలులో ఉన్న వేళ కూడా వైకాపాకు మేలు జరిగేలా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికలయ్యే వరకు ఆస్తిపన్నుపై ఒత్తిడి చేయొద్దని మౌఖిక ఆదేశాలు
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టల్లా తలూపుతూ గత ఐదేళ్లుగా అడ్డగోలుగా అనుమతులిచ్చి వారి ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా పని చేసిన పురపాలక, పట్టణాభివృద్ధిశాఖలోని ఒక అత్యున్నతాధికారి... ఎన్నికల కోడ్ అమలులో ఉన్న వేళ కూడా వైకాపాకు మేలు జరిగేలా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ పూర్తయ్యే వరకు పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తి పన్ను వసూళ్ల కోసం ప్రజలకు డిమాండ్ నోటీసులివ్వొద్దని.. పన్ను చెల్లించాలని ఎవరిపైనా ఒత్తిడి తేవొద్దని కింది స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చారు. ఏప్రిల్ 1 నుంచి చేపట్టిన ఆస్తి పన్ను వసూళ్ల కారణంగా ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆందోళన ఎన్నికల్లో పార్టీపై ప్రభావం చూపుతుందని.. ప్రచారానికి వెళుతున్న నేతలను ప్రజలు నిలదీయక ముందే నివారణ చర్యలు తీసుకోవాలన్న వైకాపా పెద్దల ఆదేశాలతో అత్యున్నతాధికారి రంగంలోకి దిగారు. సోమవారం నుంచి ఆస్తి పన్ను వసూళ్ల కోసం సిబ్బందిని వీధుల్లోకి పంపొద్దని అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చారు. దీంతో ఆదివారం సెలవు రోజు కూడా ఆస్తి పన్ను చెల్లించి 5% రిబేటు ప్రజలు ఉపయోగించుకోవాలని తెగ హడావుడి చేసిన ఉద్యోగులు సోమవారం తమ నోటికి తాళాలు వేసుకున్నారు. ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకొచ్చి పన్ను చెల్లిస్తే తీసుకోవాలని.. ఎవరిపైనా ఒత్తిడి చేయొద్దని అధికారులు సిబ్బందికి ఆదేశాలిచ్చారు.
చెత్త పన్ను వెనుకా ఇదే వ్యూహం
పట్టణ స్థానిక సంస్థల్లో ఇళ్ల నుంచి చెత్త సేకరణపై వసూలు చేస్తున్న వినియోగ రుసుములు ఎన్నికల ముందు నిలిపి వేయడంలోనూ అత్యున్నతాధికారి ప్రమేయం ఉంది. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఆదేశాలతోనే ఇళ్ల నుంచి చెత్త సేకరణ అమలులో ఉన్న పుర, నగరపాలక సంస్థల్లో రెండు, మూడు నెలలుగా వసూళ్లు నిలిపివేశారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి వసూళ్లలో వెనుకబడిన వార్డు సచివాలయాల ఉద్యోగులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసే కమిషనర్లూ కొద్ది రోజులుగా కిమ్మనడం లేదు. చెత్త పన్ను వసూళ్లపై మొదటి నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా జగన్ ప్రభుత్వం ప్రజలు ముక్కుపిండి మరీ ఏటా రూ.140 కోట్లపైనే వసూలు చేస్తోంది. ఎన్నికల కోడ్ రావడానికి రెండు నెలల ముందు నుంచి చెత్త పన్ను వసూళ్లపై ఒత్తిడి తగ్గించారు. ప్రస్తుతానికి చాలా పుర, నగరపాలక సంస్థల్లో ఈ ప్రస్తావనే లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు మృతి
ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు అలియాస్ కృష్ణబాబు(71) మంగళవారం మృతిచెందారు. అనారోగ్యం కారణంగా కొంతకాలంగా హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. -
గుంతల రోడ్లకు రెండు ప్రాణాలు బలి
రాష్ట్రంలో గుంతల రోడ్లు ప్రాణాలు తీస్తున్నాయి. గుంతల్ని చూసి అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో ఒకరు, బురదతో నిండిపోయిన గోతుల్లోపడి మరొకరు మంగళవారం మృతి చెందారు. రోడ్డు మీద గుంతలు పూడ్చలేని పాలకుల నిర్లక్ష్యం రెండు కుటుంబాలను దుఃఖంలో ముంచేసింది. -
తిరుమల చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
శ్రీవారి దర్శనార్థం తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. స్థానిక రచనా అతిథిగృహం వద్ద రేవంత్రెడ్డికి తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. -
5 వేల మంది ఒప్పంద ఉపాధ్యాయినుల మెడపై కత్తి
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) ఉపాధ్యాయినులు, భవిత కేంద్రాల్లోని ప్రత్యేక ఉపాధ్యాయుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. వీరి పనితీరును మదింపు చేసి ఒప్పందాన్ని పొడిగించేందుకు సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) చర్యలు చేపట్టింది. -
విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు
విద్యార్థుల ఇళ్లను ఉపాధ్యాయులు ఏడాదికి రెండు పర్యాయాలు సందర్శించాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ సూచించారు. -
నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం
తమిళనాడు పరిసర ప్రాంతంలో ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశముంది. -
ఇదీ సంగతి!
-
ఈవీఎంల ధ్వంసం ఘటనలపై ఎస్పీ ఆరా
పోలింగ్ రోజున ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనలపై పల్నాడు ఎస్పీ మలికాగార్గ్ ఆరా తీశారు. మంగళవారం ఆమె రెంటచింతల మండలం పాల్వాయిగేటు, తుమృకోట గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. -
గూగులమ్మ ఇంట ఏఐ పంట
టెక్నాలజీ రంగంలో ఎక్కడ చూసినా కృత్రిమ మేధ (ఏఐ) హవానే. గూగుల్ వార్షిక డెవలపర్ సదస్సు ఏ/ఓ 2024 కూడా దీనికే పెద్ద పీట వేసింది. ఇటీవల జరిగిన ఈ సదస్సులో గొప్ప గొప్ప కృత్రిమ మేధ నమూనాలను ప్రదర్శించింది. -
మెప్మా ఎండీపై విచారణకు ఈసీ ఆదేశం
ఎన్నికల్లో వైకాపాకి అనుకూలంగా పని చేశారని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఎండీ విజయలక్ష్మిపై వచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి విచారణకు ఆదేశించారు. -
62 ఏళ్లు పూర్తయ్యేవరకూ సర్వీసులో కొనసాగొచ్చు
రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)లో పనిచేస్తున్న ఉద్యోగులు 62 ఏళ్లు పూర్తయ్యేవరకు సర్వీసులో కొనసాగవచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. పీఏసీఎస్ ఉద్యోగుల్లో ఎవరైనా 60 ఏళ్ల తర్వాత పదవీ విమరణ చేసి, ఇంకా 62 ఏళ్లు పూర్తికాకుంటే అలాంటివారిని పునర్నియమించాలని ఆదేశించింది. -
ఎగువ కాఫర్ డ్యాం సీపేజీకి కట్టడి ఎలా?
పోలవరం ప్రాజెక్టుకు పెను సవాల్గా నిలిచిన ఎగువ కాఫర్ డ్యాం సీపేజీ పరిష్కారానికి అధికారులు దారులు వెతుకుతున్నారు. కేంద్ర జలసంఘం సూచన మేరకు గుత్తేదారు ఏజెన్సీ సంస్థ తరఫున ఆఫ్రి డిజైన్ కన్సల్టెన్సీ సంస్థను నియమించారు. -
నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత
పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) ప్రతినిధుల మధ్య మంగళవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. -
‘నాడు-నేడు’ అదే గోడు!
ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన ‘నాడు-నేడు’ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఐదారు నెలలుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు సంస్థలు సామగ్రి సరఫరాను నిలిపివేశాయి. చాలా బడుల్లో సిమెంటు లేక పనులు సాగట్లేదు. -
ఏబీ వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా హైకోర్టులో వ్యాజ్యం
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ హైదరాబాద్లోని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఈనెల 8న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. -
ఎన్నికల ఘర్షణ కేసుల్లో 4,668 మంది గుర్తింపు
ఎన్నికల ముందు రోజు, ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన ఘర్షణలకు సంబంధించి నమోదైన కేసుల్లో 4,668 మందిని గుర్తించి కొంత మందిని అరెస్ట్ చేశామని, మరికొందరికి నోటీసులు జారీ చేశామని డీజీపీ హరీశ్కుమార్ గుప్తా తెలిపారు. -
సంక్షిప్త వార్తలు
తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ మంగళవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గొంతుపై కాలుతో తొక్కి.. భార్య ప్రాణం తీసిన భర్త
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..