Chandrababu: 2047 నాటికి ప్రపంచ శక్తిగా భారత్‌: చంద్రబాబు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహనీయులు త్యాగఫలం మన స్వాతంత్ర్య భారతమన్నారు.

Updated : 15 Aug 2023 12:04 IST

అమరావతి: 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహనీయులు త్యాగఫలం మన స్వాతంత్ర్య భారతమన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధనకు, అద్భుతమైన దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. 

PM Modi: ఏకధాటిగా 90 నిమిషాలు.. ప్రసంగంలో మోదీ సరికొత్త రికార్డ్‌

అసమానతలు తొలగించి, పేదరికం రూపుమాపి.. తిరుగులేని శక్తిగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన విజన్‌తో ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. తద్వారా 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా ఆవిర్భవిస్తుందని అభిప్రాయపడ్డారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని