KTR: పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది: కేటీఆర్
నగర ప్రజల సమస్యల పరిష్కారంలో జీహెచ్ఎంసీది ముఖ్య పాత్రని మంత్రి కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్: నగర ప్రజల సమస్యల పరిష్కారంలో జీహెచ్ఎంసీది ముఖ్య పాత్రని మంత్రి కేటీఆర్ అన్నారు. సమన్వయంతో అన్ని శాఖల అధికారులు ఒక్క దగ్గర ఉండాలన్న లక్ష్యంతో వార్డు ఆఫీసులు ఏర్పాటు చేశామన్నారు. జీహెచ్ఎంసీ అధికారులతో కేటీఆర్ ఇవాళ సమావేశమయ్యారు. పంతాలకు వెళ్లకుండా ఏ శాఖ అధికారులైనా జీహెచ్ఎంసీ అనుమతి తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. జవహర్నగర్ డంప్ యార్డు 8 వేల టన్నులు దాటిపోయిందని, డంప్ యార్డుల కోసం వ్యవసాయానికి యోగ్యత లేని భూమిని గుర్తించాలని రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి కలెక్టర్లను కేటీఆర్ ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా డంప్ యార్డ్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వచ్చే చెత్తను వేరు చేసి, విద్యుత్ ఉత్పత్తి చేసేలా డంప్ యార్డ్లు ఉండాలన్నారు. దుండిగల్, ఖానాపూర్, ప్యారా నగర్ డంప్ యార్డ్ల అంశంలో పూర్తి నివేదికను వారంలో సమర్పించాలని సంబంధిత అధికారులను కేటీఆర్ ఆదేశించారు.
మరోవైపు, గంజాయి విక్రయంపై ఉక్కుపాదం మోపాలని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పబ్లు, హుక్కా సెంటర్లు, పాఠశాలలు, ఫామ్ హౌస్ల చుట్టూ పోలీసుల నిఘా పెంచాలన్నారు. ఇందుకోసం సీసీ కెమెరాలు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని, మాదకద్రవ్యాల అలవాట్లు తీవ్రమైన నేరాలకు కారణం అవుతాయని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మార్ కేసులో తీర్పు
11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మార్ కేసులో డిశ్చార్జి పిటిషన్లపై సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించింది. -
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆధారాలను చెరిపేసిన ఎంపీ అవినాష్రెడ్డి.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారని వైఎస్ సునీత ప్రశ్నించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం
బ్యాంకాక్లో జరిగిన ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి డాక్టర్ వై.మమతా చౌదరి మూడు టైటిల్స్ కైవసం చేసుకున్నారు. -
రైళ్లలో చోరీలకు పాల్పడే ముఠా అరెస్టు
రైళ్లలో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆయుధాలు అప్పగించేదే లేదు..!’ ఆర్మీని అడ్డుకున్న మహిళలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్పై భారత్ విజయం
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్