రేపటి నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం
ప్రముఖ శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని రెండు నెలల మండల పూజలో భాగంగా ఆదివారం సాయంత్రం తెరిచారు. సోమవారం ఉదయం నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతి ఇవ్వనున్నట్లు ట్రావెన్కోర్ ఆలయ బోర్డు
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని రెండు నెలల మండల పూజలో భాగంగా ఆదివారం సాయంత్రం తెరిచారు. సోమవారం ఉదయం నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతి ఇవ్వనున్నట్లు ట్రావెన్కోర్ ఆలయ బోర్డు (టీడీబీ) వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను పక్కాగా అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి ఆలయ బోర్డు మార్గదర్శకాలను విడుదల చేసింది. నిలక్కల్, పంబా బేస్ క్యాంప్కు చేరుకునే 48 గంటల ముందు చేయించుకున్న పరీక్షలో కరోనా నెగెటివ్ రిపోర్టుతో వచ్చిన భక్తులనే దర్శనానికి అనుమతిస్తారు.
‘వర్చువల్ క్యూ’ పద్ధతిలో రిజిస్టర్ చేసుకున్న భక్తులను రోజుకు వెయ్యి మంది చొప్పున దర్శనభాగ్యం కల్పిస్తారు. శని, ఆదివారాల్లో 2 వేల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకోవచ్చు. మండల విలక్కు- పూజలో భాగంగా రెండు నెలల పాటు జరిగే పూజా కార్యక్రమాల్లో మొత్తం 85,000 మంది దర్శనం చేసుకునేలా దేవస్థానం బోర్టు ఏర్పాట్లు చేసింది. 10 ఏళ్లలోపు, 60 ఏళ్ల పైబడిన వయస్సు ఉన్న వారిని దర్శనానికి అనుమతించరు. ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో వందల మంది వైద్యసిబ్బంది ఆలయానికి వెళ్లే మార్గాల్లో భక్తులకు కరోనా టెస్టులు చేయనున్నారు. పంబా నదిలో దిగి స్నానాలు చేయడానికి భక్తులకు అనుమతి లేదని ఆలయ వర్గాలు వివరించాయి. ఈ నేపథ్యంలో భక్తులు స్నానాలు చేసేందుకు అనుకూలంగా ప్రత్యేకంగా షవర్లను ఏర్పాటు చేశారు. పంబాబేస్ క్యాంపుతో పాటు ఆలయ పరిసరాల్లో భక్తులు బస చేయడానికి వీలు లేదని ట్రావెన్కోర్ ఆలయబోర్డు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆధారాలను చెరిపేసిన ఎంపీ అవినాష్రెడ్డి.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారని వైఎస్ సునీత ప్రశ్నించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం
బ్యాంకాక్లో జరిగిన ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి డాక్టర్ వై.మమతా చౌదరి మూడు టైటిల్స్ కైవసం చేసుకున్నారు. -
రైళ్లలో చోరీలకు పాల్పడే ముఠా అరెస్టు
రైళ్లలో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
డీల్ కుదిరినా.. కుదరకపోయినా రఫాపై దండయాత్రే: నెతన్యాహు
-
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
-
ఎన్నికల ముందే కేజ్రీవాల్ అరెస్టు ఎందుకు? ఈడీకి ‘సుప్రీం’ ప్రశ్న
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు దూరం.. కారణమిదే
-
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత
-
సేల్స్ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్.. సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసిన మస్క్