Margadarsi: కర్ణాటక కోలార్‌లో మార్గదర్శి నూతన బ్రాంచ్ ప్రారంభం

తెలుగువారికి సుపరిచితమైన మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ కర్ణాటకలోని కోలార్‌లో మరో నూతన బ్రాంచ్‌ను ఇవాళ ప్రారంభించింది.

Updated : 21 Aug 2023 12:16 IST

కోలార్‌: తెలుగువారికి సుపరిచితమైన మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ కర్ణాటకలోని కోలార్‌లో మరో నూతన బ్రాంచ్‌ను ఇవాళ ప్రారంభించింది. ఈ బ్రాంచ్‌ను ఆ సంస్థ ఎండీ శైలజా కిరణ్​ వర్చువల్‌గా ప్రారంభించారు. మార్గదర్శి సంస్థకు మొత్తంగా ఈ బ్రాంచ్‌ 109వది కాగా, కర్ణాటకలో ఇది 22వ బ్రాంచ్‌. కార్యక్రమంలో బ్రాంచ్ అధికారులు, సిబ్బంది, ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

మార్గదర్శిలో చిట్టీ పాటలకు ఆటంకాలు

మార్గదర్శిపై ఖాతాదారుల విశ్వాసం

మార్గదర్శి సంస్థలో చిట్స్‌ వేయడం ఎంతగానో ఉపయుక్తంగా ఉందని ఖాతాదారులు స్పష్టం చేశారు. బ్యాంకులతో పోలిస్తే సులభంగా తాము డబ్బును పొందుతున్నట్లు చెప్పారు. ఎన్నో ఏళ్లుగా తమకు ఆర్థిక అండగా నిలిచిందని కొనియాడారు. వేల కుటుంబాలు చిట్స్ కడుతున్నాయన్న ఖాతాదారులు.. డబ్బు తీసుకునేటప్పుడు తమకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని తేల్చి చెప్పారు. మార్గదర్శి సంస్థకు తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని