మార్గదర్శిలో చిట్టీ పాటలకు ఆటంకాలు
మార్గదర్శి చిట్ఫండ్పై వైకాపా ప్రభుత్వ వేధింపులు పరాకాష్ఠకు చేరాయి. వ్యాపారం సాగకుండా చేసే కుట్రలో భాగంగా చిట్టీల పాటకు ప్రభుత్వ అధికారులు అడ్డంకులు సృష్టించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శి కార్యాలయాల్లో సీఐడీ, రిజిస్ట్రేషన్, రెవెన్యూ, తదితర శాఖల అధికారులు ఆదివారం నాలుగో రోజూ సోదాలు కొనసాగించారు.
మొత్తం ప్రక్రియను సెల్ఫోన్లో చిత్రీకరించిన తనిఖీ అధికారులు
ఎదురు తిరిగిన చందాదారులు
ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడుతోందని ధ్వజం
మార్గదర్శి తమకు ఎలాంటి ఇబ్బందీ కలిగించట్లేదని స్పష్టీకరణ
ఈనాడు, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్పై వైకాపా ప్రభుత్వ వేధింపులు పరాకాష్ఠకు చేరాయి. వ్యాపారం సాగకుండా చేసే కుట్రలో భాగంగా చిట్టీల పాటకు ప్రభుత్వ అధికారులు అడ్డంకులు సృష్టించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శి కార్యాలయాల్లో సీఐడీ, రిజిస్ట్రేషన్, రెవెన్యూ, తదితర శాఖల అధికారులు ఆదివారం నాలుగో రోజూ సోదాలు కొనసాగించారు. చిట్టీ పాటను అధికారులు సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించారు. పాట పాడేందుకు వచ్చిన చందాదారులు, ఏజెంట్ల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఆక్షన్ ప్రక్రియకు అడ్డంకులు సృష్టించేలా హడావుడి చేశారు. దీంతో చందాదారులు కొన్నిచోట్ల సీఐడీ అధికారులకు ఎదురుతిరిగారు. మార్గదర్శిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. సంస్థ తమకు ఎలాంటి ఇబ్బందులూ కలిగించలేదని తేల్చి చెప్పారు. దీంతో అధికారులు వెనక్కి తగ్గారు. చందాదారులను పలు చోట్ల అధికారులు వేధింపులకు గురిచేశారు.
ఏజెంట్లే లక్ష్యంగా ప్రశ్నల వర్షం
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని అయిదు కార్యాలయాల్లో ఆక్షన్ ప్రక్రియకు ఆటంకాలు కలిగించేలా అధికారులు హడావుడి చేశారు. చిట్ పాడేందుకు వచ్చినవారు, ఏజెంట్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. వారి స్టేట్మెంట్లు తీసుకుని, వీడియోలు చిత్రీకరించారు. విజయవాడ వన్టౌన్ మార్గదర్శి శాఖలో అధికారులు ఆక్షన్ హాలులోనే ఉండి ఆటంకాలు కలిగించేందుకు ప్రయత్నించారు. దీని వల్ల పాట పాడేందుకు వచ్చిన చందాదారులు, ఏజెంట్లు ఇబ్బందిపడ్డారు. అధికారులు దురుసుగా ప్రవర్తిస్తుండటంతో మార్గదర్శి సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై నందిగామకు చెందిన మార్గదర్శి ఏజెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని లబ్బీపేట శాఖలో చిట్ పాడేందుకు వచ్చిన వారి వివరాలు నమోదు చేసుకున్నారు. గవర్నర్ పేట బ్రాంచిలో సీఐడీ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చిట్ వేలంలో పాల్గొనేందుకు వచ్చిన సభ్యుల ఫొటోలను సెల్ఫోన్లలో తీసుకున్నారు. ఏజెంట్లను గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. కమీషన్ ఎలా ముడుతుంది? ఎన్ని చిట్లలో ఎంత మందిని చేర్పించారని ఆరా తీశారు. వారి స్టేట్మెంట్లు నమోదు చేసుకున్నారు. గుడివాడ, మచిలీపట్నంలోని శాఖల్లోనూ వేలం ప్రక్రియను వీడియో తీశారు. చందాదారుల చిరునామాలు, ఫోన్ నంబర్లను సేకరించారు. వేలం ముగిసిన తర్వాత వారి నుంచి స్టేట్మెంట్లను రికార్డు చేశారు.
సంతకం పెట్టాలని ఉద్యోగికి బెదిరింపు
ఒంగోలు మార్గదర్శి శాఖ కార్యాలయంలో అధికారులు ప్రతి ఒక్కరినీ వీడియోలు తీస్తూ ఇబ్బందులకు గురిచేశారు. చందాదారులు ఎవరెవరు వస్తున్నారు? వెళుతున్నారు? అనే విషయాన్ని ఓ అధికారి చేత వీడియోలు, ఫొటోలు తీయించారు. సంతకం పెట్టాలని ఒక ఉద్యోగిని బెదిరించారు.
ఈటీవి ప్రతినిధి మొబైల్ లాక్కున్న సీఐడీ అధికారులు
చిత్తూరు శాఖ మేనేజర్ పంచనామా పత్రంపై సంతకాలు పెట్టకుండా ఇంటికి ఎలా వెళ్తారని అక్కడున్న మిగతా సిబ్బందిని సీఐడీ అధికారులు గదమాయించారు. దీనిపై ఉన్నతాధికారులకు చిట్స్ రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. అనంతరం రాత్రి 7 గంటలకు సీఐడీ అధికారులు మార్గదర్శి కార్యాలయం నుంచి బయలుదేరుతుండగా మొబైల్ ఫోన్లో వీడియో తీస్తున్న ఈటీవీ ప్రతినిధి ఫోన్ను సీఐడీ అధికారులు లాక్కున్నారు. ఆ ఫోన్లోని మొత్తం డేటాను రికవరీ చేయాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు. ఈనాడు, ఈటీవీ ప్రతినిధులు అదేమని గట్టిగా ప్రశ్నించడంతో మొబైల్ ఫోన్ ఇచ్చి వెళ్లిపోయారు.
చందాదారులపై గంటపాటు ప్రశ్నల వర్షం
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 5 కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగాయి. గుంటూరు అరండల్పేట, మార్కెట్ సెంటర్ కార్యాలయాల్లో చిట్టీ పాటలను అధికారులు సెల్ఫోన్లో చిత్రీకరించారు. తెనాలి కార్యాలయానికి వచ్చిన చందాదారులను అధికారులు దాదాపు గంటపాటు రకరకాల ప్రశ్నలు వేసి సమాచారాన్ని సేకరించారు. నర్సరావుపేటలో చందాదారుల తరఫున చిట్టీపాటలో పాల్గొన్న ఏజెంట్ల నుంచి అధికారులు వాంగ్మూలాలు నమోదు చేశారు. మండపేటలో మేనేజర్ కృష్ణారావు మధ్యాహ్నం తర్వాత కార్యాలయానికి రావాలని సీఐడీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఆయనపై ఒత్తిడి తెచ్చారు. మార్గదర్శి సిబ్బంది ఫోన్ నంబర్లను అధికారులు సేకరించారు. నెల్లూరు జిల్లా వేదాయపాళెం శాఖలో అధికారులు రాసిన పత్రాలపై సంతకాలు చేయాలని ఏజెంట్లను ఒత్తిడి చేశారు.
మార్గదర్శి తమకు ఎలాంటి ఇబ్బంది కలిగించట్లేదని తేల్చి చెప్పిన చందాదారులు
విశాఖ జిల్లా పీఎంపాలెం శాఖలో బెదిరింపు ధోరణితో సీఐడీ అధికారులు ప్రశ్నలు వేయడంతో చందాదారులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తోంది కక్షసాధింపు చర్యలే తప్ప..తమకు మార్గదర్శి సంస్థ ఎలాంటి ఇబ్బందులూ కలిగించడం లేదని తేల్చిచెప్పారు. దీంతో అధికారులు వెనక్కి తగ్గారు. భీమవరం కార్యాలయంలో మేనేజర్ లేకుండా ఆక్షన్ ఎలా నిర్వహిస్తారని, దాన్ని ఆపాలని అధికారులు అక్కడి సిబ్బందిని ఆదేశించారు. తాము పాట పాడుకునేందుకు ఎంతో దూరం నుంచి వస్తే....ఆపమనడం ఏంటని చందదారులు ఎదురుతిరగడంతో అధికారులు వెనక్కి తగ్గారు. వేలం పాటను యథావిధిగా కొనసాగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రెవెన్యూ లోటు లేకుండా చూడాలి. -
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
‘రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.. ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..’ అని ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ప్రశ్నించారు. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
ఏం చెప్పినా.. తందానతాన!
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును నియమించింది. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎప్సెట్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి
తెలంగాణ ఎప్సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. -
రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు ప్రారంభం
ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సెషన్ ఒకటే నిర్వహించినట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి తెలిపారు. -
ఆరు వారాల్లో తేల్చండి.. ఏపీ చెస్ అసోసియేషన్కు గుర్తింపుపై హైకోర్టు ఆగ్రహం
ఏపీ చెస్ అసోసియేషన్కు అనుబంధ గుర్తింపు ఇచ్చే వ్యవహారంలో జాతీయ క్రీడల కోడ్ నిబంధనలకు లోబడి తగిన ఉత్తర్వులు జారీచేయాలని అఖిల భారత చదరంగ సమాఖ్య కార్యదర్శిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. -
‘ప్రమాదాలు ఆందోళనకరం..’ పట్టించుకోని అధికారగణం!
రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. -
స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పకడ్బందీ భద్రత ఉండాలి
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
24లోగా రబీ పంట నష్టాన్ని లెక్కించండి
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24 లోగా పంటనష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. -
ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సంతకాల సేకరణ
జగన్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పౌర సమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ‘ఛేంజ్.ఓఆర్జీ’లో వేల మంది సంతకాలు చేస్తున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి క్యూలైన్లో వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్లు లేని భక్తులు శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. -
ఉన్నత విద్యామండలి ఛైర్మన్పై గవర్నర్కు ఫిర్యాదు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిపై గవర్నర్కు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా.. చర్యల కోసం వాటిని ఉన్నత విద్యాశాఖకు పంపించారు. -
కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.లావణ్య దేవిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్